Iran: ఇరాన్‌ లో కిడ్నాపైన ముగ్గురు భారతీయ యువకులు క్షేమం

ఇరాన్‌ లో కిడ్నాపైన ముగ్గురు భారతీయ యువకులు క్షేమం

Iran : ఇరాన్‌ లో గత నెలలో అపహరణకు గురైన ముగ్గురు భారతీయ యువకులు క్షేమంగా ఉన్నారు. వారిని టెహ్రాన్‌ పోలీసులు దుండగుల చెర నుంచి రక్షించారు. భారత్‌ లోని ఇరాన్‌(Iran) రాయబార కార్యాలయం ‘ఎక్స్‌’ వేదికగా ఈ విషయాన్ని తెలియజేసింది. దీనితో బాధితుల కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రస్తుతం ఇరాన్ పోలీసుల సంరక్షణలో ఉన్న బాధితులు… విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిబంధనల మేరకు త్వరలో భారత్ కు చేరుకోనున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Iran Kidnapers Released

పంజాబ్‌కు చెందిన సంప్రీత్, అమృత్‌పాల్, జస్పాల్‌ లు… ఢిల్లీ నుంచి మే 29న… ఉద్యోగాల కోసం ఏజెంట్ల సాయంతో డంకీ మార్గంలో ఆస్ట్రేలియాకు బయల్దేరారు. వారిని ఏజెంట్లు తాత్కాలికంగా బస చేద్దామని నమ్మించి ఇరాన్‌ తీసుకెళ్లారు. అక్కడ వీరు కిడ్నాప్‌ నకు గురైనట్లు తెలుసుకున్న బాధిత యువకుల కుటుంబ సభ్యులు పంజాబ్‌ లోని అధికారులను ఆశ్రయించారు. తమవారిని విడుదల చేసేందుకు కిడ్నాపర్లు డబ్బు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. పంజాబ్‌ ప్రభుత్వం ఈ విషయాన్ని ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లింది. వారు సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. కేసు నమోదు చేసిన టెహ్రాన్‌ పోలీసులు యువకుల కోసం గాలింపు చేపట్టారు.

దక్షిణ టెహ్రాన్‌ లోని వెరామిన్‌ ప్రాంతంలో వారు బందీలుగా ఉన్నట్లు గుర్తించి విడిపించారు. ప్రస్తుతం ఈ కేసును ఇరాన్‌ విదేశీ వ్యవహారాల శాఖలోని కాన్సులర్‌ విభాగం పరిశీలిస్తోందని, సంబంధిత న్యాయ అధికారులతో చర్చలు జరుపుతోందని ఎంబసీ పేర్కొంది. ఈ కేసు న్యాయ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు టెహ్రాన్‌లోని భారత ఎంబసీతో పంచుకుంటున్నట్లు తెలిపింది. మోసపూరిత వ్యక్తులు, అక్రమ ఏజెన్సీలు చెప్పే మాటలు నమ్మి ఉద్యోగాల కోసం చట్టవ్యతిరేక మార్గాల్లో ఇతర దేశాలకు రావొద్దని ఎంబసీ సూచించింది. భారతీయుల్ని కాపాడినందుకు ఇరాన్‌ ప్రభుత్వానికి భారత్‌ కృతజ్ఞతలు తెలియజేసింది.

Also Read : Elon Musk: అయోధ్య రామాలయం అద్భుతం – ఎలాన్‌ మస్క్‌ తండ్రి ఎరోల్‌ మస్క్‌

Leave A Reply

Your Email Id will not be published!