Israel: ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ ఫోన్‌

ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ ఫోన్‌

Israel : పశ్చిమాసియా దేశాలైన ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌ లోని అనుమానాస్పద అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ (Israel) దాడులకు దిగింది. ప్రతిచర్యగా ఇరాన్‌ డ్రోన్లను ప్రయోగించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు… భారత ప్రధాని మోదీకి ఫోన్‌ చేశారు. ప్రస్తుత పరిణామాలను ఆయనకు వివరించారు. ఉద్రిక్త పరిస్థితులపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని మోదీ అన్నారు. వీలైనంత త్వరగా శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించాల్సిన అవసరముందని చెప్పారు. ఈ మేరకు తాను నెతన్యాహుతో మాట్లాడినట్లు మోదీ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

Israel PM Phone Call

‘ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నుంచి ఫోన్ వచ్చింది. ప్రస్తుత పరిస్థితిని ఆయన వివరించారు. భారత్ ఆందోళనను, పశ్చిమాసియాలసో సాధ్యమైనంత త్వరగా శాంతి, సుస్థిరత నెలకొనాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆయనతో ప్రస్తావించాను’ అని మోదీ ఆ ట్వీట్‌లో తెలిపారు.

ఇరాన్‌ పై దాడికి దిగిన ఇజ్రాయెల్‌ (Israel) … దౌత్యపరంగానూ మద్దతు కూడగడుతోంది. వివిధ దేశాధినేతలతో నెతన్యాహు నేరుగా ఫోన్‌లో మాట్లాడుతున్నారు. దాడికి దిగేందుకు దారితీసిన పరిస్థితులను వివరిస్తున్నారు. జర్మన్‌ ఛాన్స్‌లర్‌ ఫ్రైడ్‌రిచ్‌ మెర్జ్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ కు కూడా ఆయన ఫోన్‌ చేసి మాట్లాడారు. మరోవైపు ఇరాన్‌ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం… ఇజ్రాయెల్‌ దాడుల్లో 78 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

ఇరాన్ న్యూక్లియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, క్షిపణి వ్యవస్థలు, మిలటరీ కమాండ్‌పై ఇజ్రాయెల్ శుక్రవారంనాడు భీకర దాడులు జరిపిది. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో విజయవంతమైన దాడులు జరిపినట్టు నెతన్యాహు ప్రకటించారు. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో పలువురు ఇరాన్ మిలటరీ సీనియర్ కమాండర్లు, ఆరుగురు అణు శాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ మండిపడింది. అమెరికా, ఇజ్రాయెల్‌ రెండూ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలి ఖొమేని హెచ్చరించారు.

Also Read : Ahmedabad Plane Crash: నిపుణులకు సైతం అంతుపట్టని ఎయిర్ ఇండియా ప్రమాదం ! అసలేం జరిగింది ?

Leave A Reply

Your Email Id will not be published!