JP Nadda : నడ్డా అవినీతి సరే కేసీఆర్ అరెస్ట్ ఎప్పుడు
బీఆర్ఎస్, బీజేపీ కలయికపై అనుమానం
JP Nadda : భారతీయ జనతా పార్టీ చీఫ్ జేపీ నడ్డా పదే పదే తెలంగాణలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ను అవినీతి ప్రభుత్వం అంటూ ఆరోపించారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నాయి. ప్రజలు కూడా పదే పదే మాటలు చెప్పడం కాకుండా చేసి చూపించాలని కోరుతున్నారు.
కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను మభ్య పెట్టడం మానుకోవాలని జేపీ నడ్డాకు హితవు చెబుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) పలు మార్లు సీఎం కేసీఆర్ ను, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సీఎంకు ఏటీఏం లాగా మారిందని ఆరోపించారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పటేల్ అయితే ప్రతి రోజూ జైలుకు వెళ్లడం ఖాయమం అంటున్నారు. కానీ కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ ఎందుకని కల్వకుంట్ల కుటుంబాన్ని అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా దాగుడు మూతలు ఆపేసి, ఉన్న ముసుగును తొలగించి ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పాలని నిలదీస్తున్నారు తెలంగాణ ప్రజానీకం. లేక పోతే రాబోయే ఎన్నికల్లో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు వెళ్లే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు.
Also Read : Anand Mahindra : ఆనంద్ మహీంద్రా ఆనందం