Bhatti Vikramarka : దొర పాల‌న‌లో స్కాంలు..క‌మీష‌న్లు

కేసీఆర్ పై మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఫైర్

Bhatti Vikramarka : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లెజిస్టేటివ్ చీఫ్ మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న చేప‌ట్టిన పీపుల్స్ మార్చ్ ఇవాల్టితో 103వ రోజుకు చేరుకుంది. న‌ల్ల‌గొండ జిల్లాలో పూర్తి చేసుకుంది ఈ యాత్ర‌. సోమవారం సూర్యాపేట నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశించింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. కేసీఆర్ త‌నంత‌కు తాను నియంత‌గా భావిస్తున్నాడ‌ని, ఆయ‌న పాల‌న ఆనాటి దొర‌ల‌ను గుర్తుకు వ‌స్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

క‌మీష‌న్ల‌కు, స్కాంల‌కు బీఆర్ఎస్ ప్ర‌భుత్వం కేరాఫ్ గా మారింద‌ని ఆరోపించారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌(Bhatti Vikramarka). రాష్ట్రంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన వ‌న‌రుల‌ను గంప గుత్త‌గా అమ్మ‌కానికి పెట్టార‌ని, అయిన వారికి, దొంగ‌ల‌కు క‌ట్ట‌బెడుతున్నాడంటూ ఆరోపించారు. త్వ‌ర‌లో జ‌రగ‌బోయే శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు కేసీఆర్ కు బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌ని అన్నారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.

పాల‌న అస్త‌వ్య‌స్తంగా మారింద‌ని, జ‌వాబుదారీత‌నం కొర‌వ‌డింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంద‌న్నారు. పండించిన పంట‌కు గిట్టుబాటు ధ‌ర రావ‌డం లేద‌న్నారు. రాష్ట్రంలో 2 ల‌క్ష‌ల‌కు పైగా ఖాళీలు ఉంటే ఒక్క పోస్టు ఇంత వ‌ర‌కు భ‌ర్తీ చేసిన పాపాన పోలేద‌ని మండిప‌డ్డారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.

Also Read : JP Nadda : న‌డ్డా అవినీతి స‌రే కేసీఆర్ అరెస్ట్ ఎప్పుడు

 

Leave A Reply

Your Email Id will not be published!