Kamal Haasan Appeal : రాహుల్ యాత్ర‌లో పాల్గొనండి – క‌మ‌ల్

త‌మిళుల‌కు పిలుపునిచ్చిన న‌టుడు

Kamal Haasan Appeal : దిగ్గ‌జ న‌టుడు త‌మిళ‌నాడుకు చెందిన క‌మ‌ల్ హాస‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయాల‌కు అతీతంగా దేశం కోసం కొన‌సాగిస్తున్న భార‌త్ జోడో యాత్ర‌కు ప్ర‌తి ఒక్క‌రు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని పిలుపునిచ్చారు. ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వీడియో సందేశాన్ని పంచుకున్నారు. ఈ మేర‌కు శ‌నివారం దానిని పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఇది వైర‌ల్ గా మారింది. ఢిల్లీకి చేరుకున్న రాహుల్ గాంధీ జోడో యాత్ర‌లో దేశ రాజ‌ధానిలో నివ‌సిస్తున్న త‌మిళులంతా పాల్గొనాల‌ని కోరారు. ఈ దేశానికి కావాల్సింది మాన‌వ‌త్వం అని కానీ మ‌తం కాద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ ఇక్క‌డ బ‌తికే హ‌క్కు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ చేప‌ట్టిన యాత్ర‌ను క‌మ‌ల్ హాస‌న్(Kamal Haasan Appeal)  ప్ర‌త్యేకంగా అభినందించారు. ఓ వైపు దేశం విద్వేషాలతో నిండి పోయింద‌ని దీనికి కావాల్సింది ద్వేషం కాద‌ని ప్రేమ కావాల‌న్న రాహుల్ గాంధీ కామెంట్స్ తో తాను ఏకీభ‌విస్తున్న‌ట్లు పేర్కొన్నారు దిగ్గ‌జ న‌టుడు. ఇదిలా ఉండ‌గా భార‌త్ జోడో యాత్ర‌లో పాల్గొనాల‌ని కోరుతూ కాంగ్రెస్ పార్టీ దేశంలోని ప్ర‌ముఖులు, వివిధ రంగాల‌కు చెందిన వారికి ఆహ్వానాలు పంపింది.

ఇప్పటికే ప‌లువురు సినీ న‌టులు పాల్గొన్నారు. త‌మ సంఘీభావాన్ని తెలియ చేశారు. సినీ ద‌ర్శ‌కులు కూడా మ‌ద్ద‌తు తెలిపారు. ఇదే స‌మ‌యంలో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ రాజ‌న్ సైతం రాహుల్ గాంధీతో క‌లిసి పాద‌యాత్ర‌లో పాల్గొన‌డం క‌ల‌క‌లం రేపింది.

ఇదిలా ఉండ‌గా ఇవాళ క‌మ‌ల్ హాస‌న్ హాజరు కావాల్సి ఉంది. అయితే అనారోగ్యం కార‌ణంగా రాలేక పోతున్న‌ట్లు తెలిపారు.

Also Read : ‘కైకాల‌’కు స‌రైన గుర్తింపు రాలేదు

Leave A Reply

Your Email Id will not be published!