Swachha Badi KTR : తెలంగాణ అంతటా ‘స్వచ్చ బడి ‘
సిద్దిపేటలో రూ. 71 కోట్ల ఖర్చు
Swachha Badi KTR : తెలంగాణలోని సిద్దిపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన స్వచ్చ్ బడికి ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. ఘన వ్యర్థాల నిర్వహణ అభ్యాస కేంద్రం, గృహ , సమాజ స్థాయి కంపోస్టింగ్ నమూనాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని ప్రశంసించారు. తాము ఇప్పటి వరకు రూ. 71 కోట్లతో మొత్తం రాష్ట్రంలోని 141 పురపాలిక సంఘాల పరిధిలో ఇలాంటి స్వచ్ఛ్ బడులను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు కేటీఆర్.
ఈ స్వచ్చ్ బడి అనేది సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ను మెరుగైన రీతిలో నిర్వహించేందుకు , తర్వాతి తరానికి శిక్షణ ఇవ్వడమే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అన్ని ఎస్ డబ్ల్యూఎం సంబంధిత కార్యకలాపాలకు, సేంద్రీయ ఆహారాన్ని పెంచడం , జ్ఞానాన్ని అందించేందుకు ఒక అభ్యాసన శిక్షణ కేంద్రంగా ఉపయోగ పడుతుందని తెలిపారు మంత్రి కేటీఆర్(KTR).
గృహ కంపోస్టింగ్ ను అభ్యసించేలా, ప్రజలను ప్రోత్సహించేందుకు , స్థిరమైన ప్రాతిపదికన వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ్ బడిని ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు మంత్రి. చెత్త నిర్వహణకు సంబంధించిన ప్రాముఖ్యత గురించి పిల్లలకు బోధించేందుకు ఇది ఉపయోగ పడుతుందన్నారు. సందర్శకులకు లైవ్ డెమో ద్వారా వివిధ హోమ్, కమ్యూనిటీ కంపోస్టింగ్ పద్దతులు అందించబడతాయని తెలిపారు.
Also Read : Arundhati Roy : అరుంధతీ రాయ్ కి అరుదైన పురస్కారం