Minister Kishan Reddy : ఇరు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికై కృషి చేస్తాను

రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు...

Minister Kishan Reddy : మోదీ కేబినెట్‌లోకి మళ్లీ చేరడం చాలా సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి మంత్రిని అయ్యానని, ఇప్పుడు రెండోసారి కేంద్రమంత్రి అయ్యే అవకాశం వచ్చిందన్నారు. కేంద్ర కేబినెట్‌లోని అన్ని విభాగాల్లో సమర్థవంతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. తనను ఎంపీగా చేసిన సికింద్రాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Minister Kishan Reddy Comment

రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు ఇప్పటి వరకు ఎన్నో ప్రాజెక్టులు తెచ్చానని, రాజకీయంగా తనతో ఏకీభవించని మూర్ఖులను పట్టించుకోవడం లేదని కొందరు అంటున్నారని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు టెక్స్‌టైల్ పార్కులు, రైల్వే ప్రాజెక్టులు, కేంద్ర ఏజెన్సీలను తీసుకొచ్చామని కిషన్‌రెడ్డి చెప్పారు.

Also Read : Telangana Sheep Scam : గొర్రెల స్కామ్ దర్యాప్తును ముమ్మరం చేసిన ఏసీబీ

Leave A Reply

Your Email Id will not be published!