Minister Uttam Kumar Reddy: కొత్త రేషన్ కార్డుల మంజూరుపై మంత్రి ఉత్తమ్ కీలక అప్‌డేట్‌

కొత్త రేషన్ కార్డుల మంజూరుపై మంత్రి ఉత్తమ్ కీలక అప్‌డేట్‌

Uttam Kumar Reddy : అర్హత ఆధారంగా ఎంతమందికైనా రేషన్‌కార్డులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త రేషన్‌ కార్డ్‌లలో చిప్‌ ఉంటుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. కొత్త రేషన్ కార్డులో క్యూ ఆర్ కోడ్ మాత్రమే ఉంటుందని, చిప్ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ, రేషన్‌ లబ్ధి దారులకు సన్నబియ్యం పంపిణీపై ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy) మీడియాతో మాట్లాడారు.

Minister Uttam Kumar Reddy

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) మాట్లాడుతూ… ‘ ఏప్రిల్‌ 30న తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు రాబోతుంది. ఆ రోజే హుజూర్ నగర్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… సన్నబియ్యం పంపిణీ ప్రారంభించబోతున్నారు. తెలంగాణలో 85శాతం జనాభాకు సన్నబియ్యం అందబోతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకోవడానికి వీలుగా డ్రా సిస్టం అందుబాటులోకి తెస్తున్నాం.

ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు కావాలన్నా అర్హతను ఆధారంగా ఇస్తున్నాం. కొత్తగా ఫిజికల్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. కార్డు ఉన్నా లేకున్నా లబ్ధిదారుల లిస్ట్‌ లో ఉంటే చాలు ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం ఇస్తాం. తెలంగాణ ఏర్పాటు నాటికి 89లక్షల 73వేల 708 కార్డులు ఉంటే… గత పదేళ్ళలో 49 వేల 479 కొత్త కార్డులు ఇచ్చారు. 90లక్షల రేషన్ కార్డులు… 2.85 కోట్ల లబ్దిదారులు ప్రస్తుతం ఉన్నారు. దీనికోసం రూ.10665 కోట్ల నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఖర్చు చేస్తున్నాయి. త్వరలోనే బియ్యంతో పాటు పప్పు, ఉప్పులాంటి వస్తువులు ఇస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని చాలామంది లబ్ధిదారులు ఉపయోగించుకోవడం లేదని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దొడ్డు బియ్యం కావడంతో డీలర్ల నుంచి బ్లాక్‌లో అక్కడక్కడా అమ్ముకోవడం జరుగుతుందని చెప్పారు.

Also Read : UP Police: రోడ్ల మీద నమాజ్ చేస్తే లైసెన్స్, పాస్‌పోర్ట్ రద్దు – మీరట్ పొలీసులు

Leave A Reply

Your Email Id will not be published!