INDW vs NZW WC : భార‌త్ పై కీవీస్ ఘ‌న విజ‌యం

62 ప‌రుగుల తేడాతో ప‌రాజయం

INDW vs NZW WC : న్యూజిలాండ్ త‌న విజ‌యాన్ని కంటిన్యూ చేస్తూ వ‌స్తోంది భార‌త మ‌హిళ‌ల జ‌ట్టుపై. ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా కీవీస్ తో సెడాన్ పార్కు వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో భార‌త జ‌ట్టు(INDW vs NZW WC) 62 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది.

బంగ్లాదేశ్ పై విజ‌యం సాధించిన న్యూజిలాండ్ మ‌రో గెలుపును త‌న ఖాతాలో వేసుకుంది. ఇక ఈనెల 6న దాయాది పాకిస్తాన్ పై భారీ తేడాతో విజ‌యాన్ని న‌మోదు చేసిన భార‌త జ‌ట్టు ఉన్న‌ట్టుండి చేతులెత్తేసింది.

కీవీస్ బౌల‌ర్ల దెబ్బ‌కు భార‌త బ్యాట‌ర్లు చేతులెత్తేశారు. ఇక అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను న్యూజిలాండ్ స‌త్తా చాటింది. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జ‌ట్లు హాట్ ఫెవ‌రేట్ లుగా ఉన్నాయి.

ఇవాళ జ‌రిగిన మ్యాచ్ లో ముందుగా భార‌త జ‌ట్టు స్కిప్ప‌ర్ మిథాలీ రాజ్ టాస్ గెలిచింది. మొద‌ట‌గా బౌలింగ్ ఎంచుకుంది. అనంత‌రం బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కు మొద‌ట్లో ఇబ్బంది ఏర్ప‌డింది.

ఆ జ‌ట్టులోని అమీలియా హాఫ్ సెంచ‌రీతో స‌త్తా చాటింది. మ‌రో స్టార్ ప్లేయ‌ర్ సాట‌ర్త్ వైట్ 75 ర‌న్స్ చేసి భార‌త బౌలర్ల‌కు చుక్క‌లు చూపించింది.

ఆ జ‌ట్టు వికెట్ కీప‌ర్ మార్టిన్ 41 ప‌రుగులు చేసింది. దీంతో ఆ జ‌ట్టు భారీ స్కోర్ చేసింది. 9 వికెట్లు కోల్పోయి 260 ప‌రుగులు చేసింది. భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన భార‌త జ‌ట్టులో హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ 71 ర‌న్స్ చేసి దుమ్ము రేపింది.

మిథాలీ రాజ్ 31 ర‌న్స్ చేసినా జ‌ట్టును గ‌ట్టెక్కించ లేక పోయారు. 46. 4 ఓవ‌ర్ల‌లో 198 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

Also Read : ‘బిస్మా’ మాతృత్వ‌పు ఊయ‌ల లోకం ఫిదా

Leave A Reply

Your Email Id will not be published!