Jairam Ramesh Yatra : భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదు
స్పష్టం చేసిన అగ్ర నేత జైరాం రమేష్
Jairam Ramesh Yatra : దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ అంటూ ముందుకు సాగుతున్న రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదన్నారు ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు జైరాం రమేష్(Jairam Ramesh Yatra). బీజేపీ రాజకీయం చేయాలని చూస్తోందని ఆరోపించారు. తాము రాజకీయం చేయడం లేదని కానీ దేశంలో మనుషుల మధ్య ప్రేమ ఉండాలని కోరుతూ మాత్రమే యాత్ర చేపట్టడం జరిగిందన్నారు.
ఇప్పటికే 100 రోజులు పూర్తి చేసుకుందని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఇప్పటి వరకు ఎనిమిదేళ్ల కాలంలో దేశానికి ఏం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చిన ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనత మోదీకి దక్కిందని ఎద్దేవా చేశారు.
ఏదో ఒక నెపం పేరుతో యాత్రను అడ్డుకోవాలని చూస్తోందంటూ మండిపడ్డారు జైరాం రమేష్. ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ , రాజస్థాన్ , హర్యానాలలో భారత్ జోడో యాత్ర పూర్తయ్యిందని తెలిపారు. మొత్తం 3,578 కిలోమీటర్లకు పైగా కొనసాగుతుందన్నారు.
బీజేపీ కరోనా పేరుతో అడ్డు చెప్పాలని చూస్తోందంటూ ఆరోపించారు జైరాం రమేష్. బీజేపీ చేపట్టే ర్యాలీలు, సభలకు ఈ కోవిడ్ రూల్స్ వర్తించవా అని ప్రశ్నించారు కేంద్ర సర్కార్ ను.
ఇదిలా ఉండగా శనివారం దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకుంది రాజీవ్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర. కావాలని అడ్డు కోవాలని చూస్తోందంటూ ఫైర్ అయ్యారు.
Also Read : కేంద్రం కరోనా ప్రోటోకాల్ జారీ చేయాలి