Modi Pakistan Sister : మోదీకి రాఖీ పంపిన పాకిస్తాన్ సోదరి
2024 ఎన్నికల్లో కూడా ప్రధాని గెలవాలి
Modi Pakistan Sister : నరేంద్ర మోదీ మోస్ట్ పాపులర్ లీడర్ గా ఎదిగారు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రత్యేకించి దాయాది పాకిస్తాన్ లో ఇంకా ఎక్కువ. మోదీ పట్టుదల, కార్యదక్షత, నాయకత్వ నైపుణ్యం, దేనినైనా ఢీకొనే సత్తా కలిగి ఉండడంతో ఫ్యాన్స్ పెరిగారు.
విచిత్రం ఏమిటంటే నరేంద్ర మోదీకి పాకిస్తాన్ కు చెందిన మహిళ మోదీని(Modi Pakistan Sister) తన సోదరుడిగా భావిస్తూ వస్తున్నారు. ఆయన పీఎంగా ఎన్నికైన నాటి నుంచి ప్రతి ఏటా క్రమం తప్పకుండా రాఖీని పంపిస్తున్నారు.
తాజాగా ఖమర్ మొహిసిన్ షేక్ రాఖీని మోదీకి తానే తయారు చేసి పంపించింది. ఈ విషయాన్ని జాతీయ మీడియా ఏఎన్ఐతో వెల్లడించింది తానే. ప్రధానిగా మోదీ అద్భుతంగా పని చేస్తున్నారని, ఆయన రాబోయే 2024లో జరిగే ఎన్నికల్లో కూడా గెలవాలని ఆకాంక్షించారు.
ఇదిలా ఉండగా ఆగస్టు 11న రాఖీ పండగ జరగనుంది. తోబుట్టువుల మధ్య అనుబంధాన్ని, ప్రేమను ఇది తెలియ చేస్తుంది. చెల్లెళ్లు అన్నలకు రాఖీలు కడతారు.
రక్షా బంధన్ కు ముందు ప్రధాని మోదీకి సోదరి ఖమర్ మొహ్సిన్ షేక్ పవిత్రమైన రాఖీని పంపించింది. తాను అన్ని సన్నాహాలు చేసుకున్నానని ఈసారి ప్రధాన మంత్రి మోదీని కలవాలని అనుకుంటున్నట్లు తెలిపింది.
ఆయన తప్పకుండా ఢిల్లీకి పిలుస్తారని ఆశిస్తున్నట్లు చెప్పింది. ఎంబ్రాయిడరీ డిజైన్ తో కూడిన రేష్మి రిబ్బన్ ను ఉపయోగించి తానే రాఖీని స్యయంగా తయారు చేశానని వెల్లడించింది.
ప్రధానికి ఓ లేఖ కూడా రాసింది. ఆయనకు ప్రధానమంత్రి అయ్యే సామర్థ్యం ఉందన్నారు.
Also Read : జేడీయూ బీజేపీ మధ్య పెరిగిన దూరం