Pallavi Prashanth Case : బిగ్ బాస్ విన్న‌ర్ పై కేసు

ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ కు బిగ్ షాక్

Pallavi Prashanth Case : హైద‌రాబాద్ – బిగ్ బాస్ 7 తెలుగు రియాల్టీ షో విన్న‌ర్ గా సిద్దిపేట జిల్లాకు చెందిన రైతు బిడ్డ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ కు బిగ్ షాక్ త‌గిలింది. షో సంద‌ర్బంగా ప్రశాంత్ ఫ్యాన్స్ ర‌చ్చ ర‌చ్చ చేశారు. ఆర్టీసీ బ‌స్సుల‌పై దాడుల‌కు దిగారు. దీనిపై తీవ్రంగా స్పందించారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్ట‌ర్ వీసీ స‌జ్జ‌నార్(VC Sajjanar) . ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా సీరియ‌స్ అయ్యారు. ఎక్క‌డ ఉన్నా స‌రే వారిని గుర్తించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు.

Pallavi Prashanth Case Viral

దీంతో ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేర‌కు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేష‌న్ లో సుమోటోగా కేసు న‌మోదు చేశారు. 147, 148, 290, 353, 427 తో పాటు 149 సెక్షన్ల కింద కేసు ఫైల్ న‌మోదు చేశారు. పలువురు అభిమానుల పైన కేసులు నమోదు చేయ‌డం విశేషం.

ప్రైవేట్ వాహ‌నాల‌ను ధ్వంసం చేసినందుకు గాను ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యారు. ఇందులో ఆరు బ‌స్సుల‌తో పాటు ఓ పోలీసు వాహ‌నం, రెండు ప్రైవేట్ వాహ‌నాల‌ను ధ్వంసం చేశారు. సీసీ ఫుటేజీ, వీడియోలో వ‌చ్చిన ఆధారాల‌తో నిందితుల‌ను గుర్తించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. దాడుల‌కు పాల్ప‌డిన వారిని ప‌ట్టుకుని తీరుతామ‌ని శ‌ప‌థం చేస్తున్నారు పోలీసులు.

Also Read : AP CM YS Jagan : ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ

Leave A Reply

Your Email Id will not be published!