PM Modi Kaikala : ‘కైకాల’ మృతి బాధాకరం – మోదీ
గొప్ప నటుడిని కోల్పోవడం బాధాకరం
PM Modi Kaikala : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ శుక్రవారం తెల్లవారుజామన ఉదయం 4 గంటలకు హైదరాబాద్ లోని తన స్వంత నివాసంలో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న ప్రధాని ట్విట్టర్ వేదికగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
ఇదిలా ఉండగా 87 ఏళ్ల వయస్సు ఉన్న కైకాల సత్యనారాయణ 770కి పైగా సినిమాలలో నటించారు. విలన్ గా, నటుడిగా, కమెడియన్ గా, నిర్మాతగా పేరొందారు. ఆయన టీడీపీలో రాజకీయ అరంగేట్రం చేశారు. మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. కైకాల సత్యనారాయణ మృతి పట్ల తెలుగు సినిమా రంగానికి చెందిన నటీ నటులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi Kaikala) శుక్రవారం చేసిన ట్వీట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు తెరపై విభిన్నమైన పాత్రలలో నటించి మెప్పించారు కైకాల సత్యనారాయణ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇదిలా ఉండగా కైకాల మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మోహన్ బాబు. ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కైకాల సత్యనారాయణ మృతి పట్ల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. పలు సినిమాలు కూడా నిర్మించారు కైకాల సత్యనారాయణ.
Also Read : ‘కైకాల’ సినీ ప్రస్థానం చిరస్మరణీయం