PM Modi Road Show : మాండ్యాలో ప్ర‌ధాని మోదీ రోడ్ షో

క‌ర్ణాట‌క ఎన్నిక‌లపై బీజేపీ ఫోక‌స్

PM Modi RoadShow : క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెల‌ల్లో రాష్ట్రంలో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా వ‌రుస‌గా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ క‌ర్ణాట‌క‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు ఆయ‌న రోడ్ షోలు చేప‌ట్టారు. ఆదివారం రాష్ట్రంలోని మాండ్య‌లో ఎన్నిక‌ల సంద‌ర్బంగా రోడ్ షో(PM Modi RoadShow) చేప‌ట్టారు. జ‌నం భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు.

మోదీ మోదీ అంటూ నినాదాల‌తో హోరెత్తించారు. మాంద్యాలో ప్ర‌ధాన మంత్రి రోడ్ షో సంద‌ర్బంగా భారీ ఎత్తున భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రంలో ప్ర‌స్తుతం భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వం న‌డుస్తోంది. రెండోసారి ప‌వ‌ర్ లోకి రావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది. మ‌రో వైపు కాంగ్రెస్ పార్టీ సైతం ఈసారి నువ్వా నేనా అన్న రీతిలో సై అంటోంది.

ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు ఈ ఎన్నిక‌ల‌ను. బెంగ‌ళూరు – మైసూర్ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభోత్స‌వంతో స‌హా రాష్ట్రంలో రూ. 16,000 కోట్ల విలువైన ప్రాజెక్టుల‌ను అంకితం చేయ‌నున్నారు. శంకుస్థాప‌న కూడా చేయ‌నున్నారు ప్ర‌ధాన మంత్రి.

మాండ్యాతో పాటు హుబ్బ‌ల్లి – ధార్వాడ‌లో ప‌లు కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన్నారు న‌రేంద్ర మోదీ(PM Modi). ఈ ప‌ర్య‌ట‌న‌లో రూ. 8,480 కోట్ల‌తో నిర్మించిన ప్ర‌తిష్టాత్మ‌క 10 లేన్ బెంగ‌ళూరు – మైసూర్ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభోత్స‌వం ప్ర‌ధాన హైలెట్ గా మారింది.

దాదాపు రూ. 4,130 కోట్ల‌తో నిర్మించ‌నున్న మైసూర్ – కుశాల్ న‌గ‌ర్ హైవే నాలుగు లైన్ల నిర్మాణానికి కూడా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ శంకుస్థాప‌న చేశారు.

Also Read : అన్నాడీఎంకే చీఫ్ ప‌ళనిస్వామిపై కేసు

Leave A Reply

Your Email Id will not be published!