PM Narendra Modi: అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలతో ప్రధాని మోదీ భేటీ

అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలతో ప్రధాని మోదీ భేటీ

Narendra Modi : ‘ఆపరేషన్‌ సిందూర్‌’, ఉగ్రవాద నిర్మూలనపై భారత వైఖరిని వివిధ దేశాలకు వివరించడంతో పాటు ఉగ్రవాదంపై పాకిస్థాన్ ద్వంద నీతిని ఎండగట్టేందుకు భారత ప్రభుత్వం అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలు వివిధ దేశాలకు పంపించిన సంగతి తెలిసిందే. ఈ పార్లమెంటరీ బృందాలు 33 దేశాల రాజధానులు, యూరోపియన్ యూనియన్‌లో పర్యటించాయి. ఈ ప్రతినిధుల బృందాల్లో మాజీ పార్లమెంటెరియన్లు, మాజీ దౌత్యవేత్తలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటనలు ముగించుకుని వచ్చిన పార్లమెంటరీ బృందాల ప్రతినిధులతో ప్రధాని మోదీ(Narendra Modi) భేటీ అయ్యారు. ఢిల్లీలోని తన అధికార నివాసంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు తమ పర్యటన విశేషాలను ప్రధానికి వివరించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం వైఖరిని తెలియజేయడంలో వారి ప్రయత్నాలను ప్రధాని ప్రశంసించారు.

PM Narendra Modi Meet

విదేశీ పర్యటనలు ముగించుకుని వచ్చిన ప్రతినిధుల బృందం ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌(S Jaishankar)ను కలుసుకుంది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత వైఖరిని బలంగా వినిపించిన సభ్యుల కృషి జైశంకర్ అభినందించారు. నాలుగు ప్రతినిధుల బృందాలకు ఎన్డీయే ఎంపీలు సారథ్యం వహించగా, వీరిలో బీజేపీకి చెందిన 2, జేడీయూ, శివసేనకు చెందిన చెరో ప్రతినిధి బృందం ఉంది. తక్కిన మూడు ప్రతినిధి బృందాలకు విపక్ష ఎంపీలు సారథ్యం వహిచారు. కాంగ్రెస్, డీఎంకే, ఎన్‌సీ (ఎస్పీ)లు ఒక్కో ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించాయి.

బీజేపీ నేతలు రవిశంకర్ ప్రసాద్, బైజంయత్ పాండ, కాంగ్రెస్ నేత శశిథరూర్, జేడీయూ నేత సంజయ్ ఝా, శివసేన నేత శ్రీకాంత్ షిండే, డీఎంకే నేత కనిమొళి, ఎన్‌సీపీ (ఎస్పీ) నేత సుప్రియా సులే సారథ్యంలో ఈ ప్రతినిధుల బృందాలు విదేశాల్లో పర్యటించాయి. టెర్రరిజంపై పోరులో అంతా ఏకతాటిపై ఉన్నామనే జాతీయ ఐక్యతా సందేశాన్ని ప్రపంచానికి చాటేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష ప్రతినిధుల బృందాలను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ వంటి నేతలు అధికార కూటమి సభ్యులతో కలిసి ప్రపంచ దేశాల్లో తమ వాణిని బలంగా వినిపించారు. మాజీ పార్లమెంటేరియన్లలో కేంద్ర మాజీ మంత్రులు గులాం నబీ ఆజాద్, సల్మాన్ ఖుర్షీద్ వంటి వారు సైతం ఉగ్రవాదంపై పోరులో భారతదేశ ఐక్యతా సందేశాన్ని చాటారు.

Also Read : Minister Rajnath Singh: అంతర్జాతీయ టెర్రరిజానికి తండ్రి పాకిస్థాన్ – మంత్రి రాజ్‌నాథ్ సింగ్

Leave A Reply

Your Email Id will not be published!