Amit Shah Prabhas : ట్ర‌బుల్ షూట‌ర్ తో ప్ర‌భాస్ భేటీ

ఇప్ప‌టికే క‌లిసిన జూనియ‌ర్ ఎన్టీఆర్

Amit Shah Prabhas : ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శుక్ర‌వారం హైద‌రాబాద్ కు రానున్నారు.రాత్రి 9.50 గంట‌ల‌కు శంషాబాద్ కు చేరుకుంటారు.

అక్క‌డి నుంచి ఆయ‌న రాత్రి నేష‌న‌ల్ పోలీస్ అకాడ‌మీలో బ‌స చేస్తారు. ఇక అమిత్ షా ప‌ర్య‌టించ‌డం ఇది రెండోసారి. గ‌త ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు.

ఇవాళ మ‌రో కీల‌క‌మైన విష‌యం ఏమిటంటే పాన్ ఇండియా హీరోగా పేరొందిన డార్లింగ్ ప్ర‌భాస్ క‌ల‌వ‌నున్న‌ట్లు స‌మాచారం. 15 రోజుల వ్య‌వ‌ధిలో అమిత్ షా(Amit Shah Prabhas)  రావ‌డం ఇది రెండోసారి కావ‌డం విశేషం.

త‌న చివ‌రి ప‌ర్య‌ట‌న‌లో జూనియ‌ర్ క‌లిశారు. తార‌క్ రాజ‌కీయ ప్ర‌వేశానికి బీజేపీ నాయ‌కుడు వ్యూహాలు ర‌చిస్తున్న‌ట్లు స‌మాచారం.

కాగా ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆర్ఆర్ఆర్ మూవీలో జూనియ‌ర్ ఎన్టీఆర్ చేసిన న‌ట‌న బాగుంద‌ని, అందుకే అభినందించేందుకు తాను పిలిపించాన‌ని అమిత్ షా స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా లెజెండ‌రీ న‌టుడు , కేంద్ర మాజీ మంత్రి గా ఉన్న కృష్ణంరాజు మ‌ర‌ణించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ ను క‌లుసుకుని ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు సానుభూతి తెలియ చేయ‌నున్నారు.

కృష్ణం రాజు బీజేపీలో చాలా కాలం పాటు ఉన్నారు. కేంద్ర మంత్రిగా కూడా ప‌ని చేశారు. 1998 ఎన్నిక‌ల్లో కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందారు. ప్ర‌భాస్ కు దేశ వ్యాప్తంగా చాలా పేరుంది. దీంతో అమిత్ షా ఏం చేయ‌బోతున్నార‌నేది ఉత్కంఠ‌గా మారింది.

Also Read : రూ. 300 కోట్లు దాటిన బ్ర‌హ్మాస్త్ర చిత్రం

Leave A Reply

Your Email Id will not be published!