Prakash Raj : ఇద్దరు సీఎంల భేటీలో ప్ర‌కాశ్ రాజ్

చ‌ర్చ‌నీయాంశంగా మారిన న‌టుడు

Prakash Raj  : దేశ వ్యాప్తంగా మోదీకి వ్య‌తిరేకంగా ప్ర‌త్యామ్నాయ కూట‌మిని కూడ‌గ‌ట్టే ప‌నిలో బిజీగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ముంబైలో మ‌రాఠా సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేతో భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. ఈ త‌రుణంలో సీఎం వెంట ఆయ‌న కూతురు ఎమ్మెల్సీ క‌విత‌, ఎంపీ సంతోష్ కుమార్, ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి ఉన్నారు.

అయితే ఊహించ‌ని స‌న్నివేశం చోటు చేకుందుంది. హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరి వెళ్లిన కేసీఆర్ కు ముంబైలోని ఛ‌త్ర‌ప‌తి శివాజీ ఎయిర్ పోర్టులో ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ (Prakash Raj )స్వాగ‌తం ప‌లికారు.

ప్ర‌స్తుతం ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయ‌న ఒక్క‌డే మొద‌టి నుంచి ప్ర‌ధాన మంత్రి, బీజేపీకి వ్య‌తిరేకంగా త‌న స్వ‌రాన్ని వినిపిస్తూ వ‌స్తున్నారు. ప్ర‌తి చోటా జ‌రిగిన వేదిక‌ల్లో ఆయ‌న కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు కూడా.

ఈ త‌రుణంలో కేసీఆర్ సైతం ఇప్పుడు మోదీపై నేరుగా యుద్దం ప్ర‌క‌టించారు. అంతే కాదు మోదీని దేశం నుంచి వెలి వేయాల‌ని, త‌రిమి కొట్టాల‌ని పిలుపునిచ్చారు.

అందులో భాగంగానే ఇప్ప‌టికే సీఎంలు మ‌మ‌తా బెన‌ర్జీ, ఎంకే స్టాలిన్, పినర‌య్ విజ‌య్ ల‌ను క‌లుసుకున్నారు. వారు కూడా కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ త‌రుణంలో ప్ర‌కాశ్ రాజ్ ఇద్ద‌రు సీఎంల భేటీలో కూడా పాల్గొన్నారు.

ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నెట్టింట్లో ప్ర‌కాశ్ రాజ్(Prakash Raj ), సీఎం కేసీఆర్ క‌ల‌యిక‌, స‌మావేశం చ‌ర్చ‌కు దారి తీసింది. ప్ర‌స్తుతం రాజ‌కీయాలు, సినీమా రంగం క‌ల‌గ‌లిసి పోవ‌డం మామూలై పోయింది.

Also Read : 19న ఆడ‌వాళ్లు మీకు జోహార్లు టీజ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!