Sangareddy: తెలంగాణలో స్వల్ప భూకంపం ?

తెలంగాణలో స్వల్ప భూకంపం ?

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో స్వల్ప భూకంపం సంబవించింది. న్యాల్ కల్ మండలంలోని న్యాల్‌కల్, ముంగి గ్రామాల్లో స్వల్పంగా భూమి కనిపించింది. సుమారుగా సాయంత్రం 4.30 సమయంలో భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. భూమి ఒక్కసారిగా కంపించడంతో ఇళ్ల నుంచి జనాలు బయటికి పరుగులు తీశారు. పెద్ద శబ్దంతో ప్రకంపనలు వచ్చాయని… భూకంపం ధాటికి వస్తువులు కిందపడినట్లు ప్రజలు చెబుతున్నారు.

Sangareddy Viral

అంతేకాదు భూమిలో నుంచి వింత శబ్దాలు వచ్చినట్లు పేర్కొంటున్నారు. గతంలోనూ ఇలాంటి ప్రకంపనలు వచ్చినట్లు గ్రామస్తులు వెల్లడించారు. దీనితో భూ ప్రకంపనాలపై ఆయా గ్రామాల్లో అధికారులు ఆరా తీస్తున్నారు.

Also Read : Telangana Govt : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం

Leave A Reply

Your Email Id will not be published!