Simon Doull Samson : పంత్ కంటే సంజూ శాంసన్ బెట‌ర్

కామంటేట‌ర్ సైమ‌న్ డౌల్ కామెంట్స్

Simon Doull Samson : న్యూజిలాండ్ సీరీస్ లో భాగంగా టి20 సీరీస్ తో పాటు వ‌న్డే సీరీస్ లో వ‌రుస‌గా రిష‌బ్ పంత్ ను కొన‌సాగిస్తుండ‌డంపై తీవ్ర విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతోంది. ప్ర‌ధానంగా భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అనుస‌రిస్తున్న వైఖ‌రిని,

జ‌ట్టు మేనేజ్ మెంట్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై భ‌గ్గుమంటున్నారు ఫ్యాన్స్ . ప్ర‌ధానంగా ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్ , రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్కిప్ప‌ర్ సంజూ శాంస‌న్(Sanju Samson) మ‌ధ్య పోటీ నెల‌కొంది. గ‌త కొన్ని మ్యాచ్ లు చూస్తే పూర్తిగా విఫ‌లం అవుతూ వ‌చ్చాడు పంత్. అయినా బీసీసీఐ కొన‌సాగిస్తూ వ‌చ్చింది.

దీనిపై తీవ్ర రాద్దాంతం చోటు చేసుకుంది. బీసీసీఐలో పాలిటిక్స్ ఎక్కువ‌య్యాయ‌ని, ప్ర‌తిభ క‌లిగిన ఆట‌గాళ్ల‌ను కావాల‌ని ప‌క్క‌న పెడుతున్నార‌ని ఆరోణ‌లున్నాయి. ప్ర‌పంచంలో ఏ దేశానికి చెందిన క్రీడా సంస్థ అయినా ప్ర‌తిభ క‌లిగిన‌, అద్భుతంగా ఆడే వాళ్లకు ఛాన్స్ ఇస్తాయి.

అది ప్ర‌తి ఒక్క‌రు పాటించేదే. కానీ భార‌త దేశానికి సంబంధించినంత వ‌ర‌కు బీసీసీఐ తాను ఏ నిర్ణ‌యం తీసుకుంటే అదే ఫైన‌ల్. తాజాగా ప్ర‌ముఖ క్రికెట్ కామెంటేట‌ర్ సైమ‌న్ డౌల్(Simon Doull) సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. రిష‌బ్ పంత్ అద్భుత‌మైన ఆట‌గాడే కావ‌చ్చు కానీ వైట్ బాల్ బ్యాట‌ర్ కాద‌ని పేర్కొన్నాడు.

ఈ ఫార్మాట్ లో పంత్ కంటే కేర‌ళ స్టార్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ బెట‌ర్ ప్లేయ‌ర్ అని స్ప‌ష్టం చేశాడు. ఇండియ‌న్ కామెంటేట‌ర్ హ‌ర్ష బోగ్లే తో మాట్లాడిన సైమ‌న్ డౌల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. అద్భుతంగా రాణిస్తున్న ప్లేయ‌ర్ శాంసన్ ను ఎందుకు ప‌క్క‌న పెడుతున్నారో అర్థం కావ‌డం లేద‌న్నాడు.

Also Read : ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ గిన్నిస్ రికార్డ్

Leave A Reply

Your Email Id will not be published!