Team India Tour : న్యూజిలాండ్ టూర్ కు బ‌య‌లు దేరిన భార‌త్

టి20 సీరీస్ కు పాండ్యా..వ‌న్డేకు ధావ‌న్

Team India Tour : టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో సెమీస్ లోనే వెనుదిరిగిన భార‌త జ‌ట్టులో కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయి. హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్, విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, బౌల‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ను విశ్రాంతి పేరుతో ప‌క్క‌న పెట్టేసింది బీసీసీఐ.

న‌వంబ‌ర్ 18 నుండి టి20 , వ‌న్డే సీరీస్ ఆడ‌నుంది భార‌త జ‌ట్టు. టి20 టీమ్ కు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉండ‌గా వ‌న్డే జ‌ట్టుకు శిఖ‌ర్ ధావ‌న్ నేతృత్వం వ‌హించ‌నున్నాడు.

ఇక న్యూజిలాండ్ తో ఆడేందుకు గాను భార‌త జ‌ట్టు(Team India Tour) బ‌య‌లు దేరి వెళ్లింది. ప్ర‌పంచ క‌ప్ కు దూర‌మ‌య్యాక పాండ్యా కేప్టెన్సీలో ఆతిథ్య న్యూజిలాండ్ టీమ్ తో ఇండియా 3 మ్యాచ్ ల టి20 సీరీస్ ఆడ‌నుంది. టి20 సీరీస్ అయ్యాక ఇరు జ‌ట్ల మ‌ధ్య మ‌రో మూడు వ‌న్డేలు ఆడుతుంది.

సూర్య కుమార్ యాద‌వ్ , లెగ్ స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ , రిష‌బ్ పంత్ ల‌తో క‌లిసి పాండ్యా నేరుగా అడిలైడ్ ఎయిర్ పోర్ట్ నుంచి న్యూజిలాండ్ కు బ‌య‌లు దేరారు. దినేష్ కార్తీక్, అక్ష‌ర్ ప‌టేల్ , ష‌మీ ఇండియాకు బ‌య‌లు దేరారు. కోచ్ గా వీవీఎస్ లక్ష్మ‌ణ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఇక జ‌ట్ల ప‌రంగా చూస్తే ఇలా ఉన్నాయి.

టి20 జ‌ట్టుకు పాండ్యా కెప్టెన్. గిల్, ఇషాన్ కిష‌న్ , దీప‌క్ హూడా, యాద‌వ్ , అయ్య‌ర్ , పంత్ , సంజూ శాంస‌న్ , సుంద‌ర్ , చాహ‌ల్ , కుల్దీప్ , సింగ్ , అర్ష్ దీప్ , సిరాజ్ , భువీ, ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు.

వ‌న్డే జ‌ట్టుకు ధావ‌న్ కెప్టెన్ . గిల్, యాద‌వ్, అయ్య‌ర్, పంత్ , సంజూ శాంస‌న్ , సుంద‌ర్ , ఠాకూర్ , షాబాజ్ , చాహ‌ల్ , అర్ష్ దీప్ , దీప‌క్ , కుల్దీప్ సేన్ , ఉమ్రాన్ మాలిక్ ఆడ‌తారు.

Also Read : టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ బాద్ షా నువ్వా నేనా

Leave A Reply

Your Email Id will not be published!