Telangana Govt : అన్న భాగ్యకు తెలంగాణ బియ్యం
బియ్యం అందించేందుకు పచ్చ జెండా
Telangana Govt : హైదరాబాద్ – తెలంగాణ సీఎం కేసీఆర్ మానవతను చాటుకున్నారు. సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన కర్ణాటక రాష్ట్రానికి తీపి కబురు చెప్పారు. ఆ రాష్ట్ర సర్కార్ పేదల కడుపు నింపేందుకు ఇటీవల అన్న భాగ్య పథకాన్ని తీసుకు వచ్చింది. ఇందుకు సంబంధించి లక్షలాది మంది ఆకలిని తీర్చే స్కీం ఇది.
Telangana Govt Decision
టన్నుల కొద్దీ బియ్యం కావాల్సి ఉంటుంది. ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah), డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ దేశంలోని అన్ని రాష్ట్రాలను బియ్యం అందించాలని కోరారు. ఈ మేరకు రెండు రాష్ట్రాలు స్పందించారు. వాటిలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం. మరొకటి కాంగ్రెస్ హయాంలో కొలువు తీరిన బాఘేల్ సర్కార్ తమ సమ్మతిని తెలియ చేశాయి.
పవర్ లోకి వచ్చే ముందు అన్న భాగ్య స్కీం ను ప్రకటించే ముందు ఎలాంటి ఆలోచన చేయలేదు. దీంతో పవర్ లోకి వచ్చాక తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. కనీసం అవగాహన లేకుండా చేసిన ప్రకటన ఆ ప్రభుత్వానికి గుదిబండగా మారంది.
ఈ కష్ట కాలంలో తాము ఆదుకునేందుకు ముందుకు వచ్చామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేసిన తెలంగాణ చీఫ్ కు ధన్యవాదాలు తెలిపారు సీఎం సిద్దరామయ్య.
Also Read : HACA Selected : కేంద్ర నోడల్ ఏజెన్సీగా హాకా