JP Nadda : ది కేరళ స్టోరీని ప్రతి ఒక్కరు చూడాలి
పిలుపునిచ్చిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
JP Nadda : దేశ వ్యాప్తంగా వివాదాలకు తెర లేపిన ది కేరళ స్టోరీ చిత్రంపై ప్రశంసలు కురిపించారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఈ మూవీ కళ్లు తెరిపిస్తుందన్నారు. భారతీయులైన హిందువులు ప్రతి ఒక్కరు ది కేరళ స్టోరీని చూడాలని పిలుపునిచ్చారు. ఈ చిత్రం విష పూరిత భీభత్సం రూపాన్ని బహిర్గతం చేస్తుందన్నారు జేపీ నడ్డా(JP Nadda). బెంగళూరులో జరిగిన స్క్రినింగ్ లో బీజేపీ నేషనల్ చీఫ్ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు.
సినిమా చూసిన అనంతరం జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. బాంబులు, మందుగుండు సామాగ్రిని ఉపయోగించని ఉగ్రవాదం కొత్త విషపూరితమైన రూపాన్ని ది కేరళ స్టోరీ బట్ట బయలు చేసిందని స్పష్టం చేశారు . కేరళలో బలవంతపు మత మార్పిడిపై ఈ చిత్రం దృష్టి సారిస్తుందని మూవీ మేకర్స్ పేర్కొన్నారు. కాగా కేరళలో అధికారంలో ఉన్న సీపీఎం, కాంగ్రెస్ పార్టీతో సహా వామఫక్షవాదులు దీనిని బీజేపీ రాజకీయం చేస్తోందంటూ ఆరోపించాయి.
తాము ఇప్పటి దాకా తుపాకీ కాల్పులు, పేలుళ్లు , ఆటోమేటిక్ ఆయుధాల గురించి విన్నాం. కానీ అవేవీ లేకుండా చాపకింద నీరులా మరో ఉగ్రవాద రూపం తెరపై కనిపించిందన్నారు జేపీ నడ్డా. ఈ రకమైన ఉగ్రవాదానికి ఏ రాష్ట్రం లేదా మతంతో సంబంధం లేదు. ఇది యువకులను ఆకర్షిస్తుంది. ఆపై వారిని తప్పుదారి పట్టిస్తుందన్నారు బీజేపీ చీఫ్(JP Nadda).
Also Read : బీహార్ సీఎం నితీశ్ ను కలుస్తా – పవార్