Sharad Pawar : బీహార్ సీఎం నితీశ్ ను కలుస్తా – పవార్
బీజేపీకి ప్రత్యామ్నాయం అవసరం
Sharad Pawar : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్(Sharad Pawar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబై పర్యటనలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ ను కలుస్తానని స్పష్టం చేశారు. ఇటీవల నితీశ్ కుమార్ ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఆయన రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ , మమతా బెనర్జీని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
త్వరలోనే సీఎంలు స్టాలిన్, పినరయ్ విజయన్ , భూపేష్ బఘేల్ , సోరేన్ లతో భేటీ అవుతానని ప్రకటించారు నితీశ్ కుమార్. ఇదే క్రమంలో శరద్ పవార్ తో పాటు శివసేన బాల్ ఠాక్రే చీఫ్ ,మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేను కూడా కలుస్తానని వెల్లడించారు.
సార్వత్రిక ఎన్నికల కంటే ముందు నితీశ్ కుమార్ ఒక ప్రతిపాదన తీసుకు వచ్చారు. దేశంలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే పోటీ చేయాలని అనుకుంటే అన్ని పార్టీలు కాకుండా ఉమ్మడి అభ్యర్థి ఒకరు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కి నచ్చింది. ఆమె బీహార్ వేదికగా విపక్షాలన్నీ ఒక్కటిగా ఉన్నాయన్న సందేశాన్ని దేశ ప్రజలకు ఇవ్వాలని ఆ దిశగా ప్రయత్నం చేయాలని సూచించారు దీదీ.
సోమవారం శరద్ పవార్ షోలాపూర్ లో మీడియాతో మాట్లాడారు. మే 11న నితీశ్ కుమార్ ముంబైలో పర్యటిస్తారని నాకు సమాచారం అందింది. అందరం కలిసికట్టుగా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు పవార్(Sharad Pawar).
Also Read : రెజ్లర్ల పోరాటం రైతన్నల యుద్ధం