DK Shiva Kumar : జేడీఎస్ తో పొత్తు ఉండ‌దు – డీకే

స్ప‌ష్టం చేసిన కేపీసీసీ చీఫ్

DK Shiva Kumar : క‌ర్ణాట‌క‌లో బుధ‌వారం పోలింగ్ ప్రారంభ‌మైంది. మొత్తం 224 సీట్ల‌కు గాను ప్ర‌జ‌లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. అధికారంలో ఉన్న బీజేపీకి ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మ‌ధ్య ట‌గ్ ఆఫ్ వార్ కొన‌సాగుతోంది.

క‌ర్ణాట‌క ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ డీకే శివ‌కుమార్ త‌న విలువైన ఓటును వినియోగించుకున్నారు. త‌న కుటుంబంతో క‌లిసి. అంత‌కు ముందు ఆయ‌న అమ్మ వారిని ద‌ర్శించుకున్నారు. ఓటు వేసిన అనంత‌రం డీకే శివ‌కుమార్ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా ప్ర‌కారం హంగ్ ఏర్ప‌డుతోంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని దీనిపై మీరేమంటార‌న్న ప్ర‌శ్న‌కు ఆస‌క‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు డీకే శివ‌కుమార్. ఇదంతా బీజేపీ ఆడుతున్న నాట‌క‌మ‌ని కొట్టి పారేశారు. తాము ఒంట‌రిగానే ప‌వ‌ర్ లోకి వ‌స్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

ప‌నిలో ప‌నిగా మాజీ ప్ర‌ధాన‌మంత్రి హెచ్ డీ దేవ‌గౌడ పార్టీ జేడీఎస్ తో ఎలాంటి పొత్తు ఉండ‌బోదంటూ స్ప‌ష్టం చేశారు. తాము ఒంట‌రిగానే ప్ర‌భుత్వానికి అవ‌స‌ర‌మ‌య్యే సీట్ల‌ను సాధించ‌గ‌లిగే స‌త్తా ఉందన్నారు. ఈసారి ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని, అది మే 13న తేలి పోతుంద‌న్నారు డీకే శివ‌కుమార్.

Also Read : ఓటు వేసిన ఎంపీ తేజ‌స్వి సూర్య

Leave A Reply

Your Email Id will not be published!