Virat Kohli RCB vs MI : ముంబై ని మట్టికరిపించిన ధీరుడు కింగ్ కోహ్లీ
Virat Kohli RCB vs MI : చిన్నస్వామి స్టేడియంలో కింగ్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రెచ్చిపోయాడు. ఐపీఎల్ 2023 (IPL 2023)లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో లీగ్ లో శుభారంభం చేసింది. విరాట్ కోహ్లీ (49 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) చిన్నస్వామి స్టేడియంలో శివతాండవం ఆడాడు.
అతడికి ఫాఫ్ డుప్లెసిస్ (43 బంతుల్లో 73; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) కూడా తోడయ్యాడు. దాంతో ముంబై నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని 16.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే నష్టపోయి సాధించిన బెంగళూరు విజయాన్ని అందుకుంది. చివర్లో మ్యాక్స్ వెల్ (3 బంతుల్లో 12 నాటౌట్; 2 సిక్సర్లు) కూడా మెరిశాడు.
టఫ్ టార్గెట్ ను ఛేజింగ్ చేసే క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఓపెనర్లు డుప్లెసిస్, కోహ్లీలు శుభారంభం చేశారు. వీరు ముంబై బౌలింగ్ ను సులభంగా ఎదుర్కొన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన బెహ్రాండార్ఫ్ బౌలింగ్ ను చీల్చి చెండాడారు. ఈ క్రమంలో ఇరువురు కూడా అర్థ సెంచరీలు సాధించారు.
తొలి వికెట్ కు 148 పరుగులు జోడించాక డు ప్లెసిస్ అవుటయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన దినేశ్ కార్తీక్ (0) డకౌట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్ వెల్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. చివర్లో కోహ్లీ మ్యాచ్ ను (Virat Kohli RCB vs MI) ముగించేశాడు.
Also Read : ముంబై ను చిత్తు చిత్తు గా ఓడించిన బెంగుళూరు