హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన మార్ఫ్ చేసిన పోస్ట్ల వ్యవహారంలో మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్ కు కోలుకోలేని షాక్ తగిలింది. తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థుల పరీక్షా పత్రం లీక్ నిరసనల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని మార్ఫ్ చేసిన (అసలు రూపాన్ని మార్చిన) పోస్ట్లను ప్రచారం చేశారన్న ఆరోపణలపై మెటా ఇండియా అధిపతి, పలు సోషల్ మీడియా ఖాతాల నిర్వాహకులపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. పరీక్షా పత్రం లీక్ వ్యవహారంపై జరిగిన నిరసనల సమయంలో ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని మార్ఫ్ చేసిన, అభ్యంతరకరమైన చిత్రాలు , వీడియోలను ప్రచారం చేశారనే ఆరోపణలపై మెటా ఇండియా హెడ్ , అనేక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల నిర్వాహకులపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు.
పరీక్షా పత్రం లీక్ వివాదంపై జవాబుదారీతనం కోరుతూ దేశవ్యాప్త నిరసనలకు నాయకత్వం వహించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనల సమయంలో మెటా యాజమాన్యంలోని ప్లాట్ఫారమ్లలో షేర్ చేసిన కంటెంట్కు ఈ కేసులు సంబంధించినవని పోలీసులు తెలిపారు. ప్రధానిని లక్ష్యంగా చేసుకుని రూపొందించిన మార్ఫ్ చేసిన దృశ్యాలు , అభ్యంతరకరమైన పోస్ట్లు అనేక సోషల్ మీడియా ఖాతాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయబడ్డాయని ఆరోపించారు. తప్పుడు , అభ్యంతరకరమైన డిజిటల్ కంటెంట్ను ప్రచారం చేసినందుకు సంబంధించిన నిబంధనల కింద ఈ ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు అధికారులు ఖాతా నిర్వాహకుల పాత్రతో పాటు, చట్టపరమైన నిబంధనలను పాటించడంలో ప్లాట్ఫారమ్ వ్యవహరించిన తీరును కూడా పరిశీలిస్తున్నామన్నారు.
