Drought Relief : కేంద్రం నుంచి కరువు సహాయక నిధి కింద కర్ణాటకకు 3454 కోట్ల నిధులు
వర్షాభావ పరిస్థితులతో పంట నష్టపోయిన రైతులకు రూ.5,661 కోట్ల పరిహారం సహా రూ.18,174 కోట్లను కరువు సహాయ ప్యాకేజీగా అందించాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది....
Drought Relief : కరువు సాయం కోసం కేంద్రం కర్ణాటకకు రూ.3,454 కోట్ల నిధులు మంజూరు చేసింది. కరువు ఉపశమనం (ఖరీప్ 2023) కింద నిధుల విడుదలకు హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి కమిటీ ఆమోదం తెలిపిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో ప్రకటించింది.
Drought Relief From Centre
వర్షాభావ పరిస్థితులతో పంట నష్టపోయిన రైతులకు రూ.5,661 కోట్ల పరిహారం సహా రూ.18,174 కోట్లను కరువు సహాయ ప్యాకేజీగా అందించాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. అయితే కేంద్ర నిధుల విడుదలలో జాప్యం కర్ణాటక, కేంద్రం మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. దక్షిణాది రాష్ట్రం పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తోందని కర్ణాటక ప్రభుత్వం ఆరోపించింది. అయితే ప్రకృతి వైపరీత్యాల నిధి కింద సహాయక చర్యలు చేపట్టేందుకు కర్ణాటక వద్ద తగినన్ని నిధులు ఉన్నాయని కేంద్రం తెలిపింది. తొమ్మిది నెలల కేంద్రం జాప్యంపై కర్ణాటక ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కరువు సహాయ నిధి నిధుల విషయంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును కోరారు. కర్ణాటకకు ఉపశమనం కలిగించేందుకు వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకుంటామని కేంద్రం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది.
Also Read : Amit Shah : మూడోసారి మోదీని ప్రధానిని చేద్దాం – అమిత్ షా