Ramasahayam Raghuram Reddy: ఖమ్మం కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్‌ వియ్యంకుడు !

ఖమ్మం కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్‌ వియ్యంకుడు !

Ramasahayam Raghuram Reddy: తెలంగాణలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ బుధవారం రాత్రి ప్రకటించారు. హైదరాబాద్‌ లోక్‌ సభ స్థానానికి మహమ్మద్‌ సమీర్‌, ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి, కరీంనగర్‌ అభ్యర్థిగా రాజేందర్‌రావు పేర్లు ఖరారు చేశారు. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. కరీంనగర్‌ నుంచి రాజేందర్‌రావు ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేశారు.

Ramasahayam Raghuram Reddy Participates

అయితే ఖమ్మం అభ్యర్థిగా ఖరారైన రామసహాయం రఘురాంరెడ్డి(Ramasahayam Raghuram Reddy) సినీ హీరో వెంకటేశ్‌, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి వియ్యంకుడు. ఆయన తండ్రి సురేందర్‌రెడ్డి ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత. గతంలో పలుసార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా సేవలందించారు. ప్రస్తుతం వయసురీత్యా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీనితో ఆయన స్థానంలో రఘురాంరెడ్డి రంగంలోకి దిగారు. ఆయనకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన కుటుంబాలతో బంధుత్వం ఉంది. హీరో వెంకటేశ్‌ కుమార్తె అశ్రితను ఆయన పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి వివాహం చేసుకోగా… మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె స్వప్నిరెడ్డిని ఆయన చిన్నకుమారుడు అర్జున్ రెడ్డి వివాహమాడారు. అలా ఇటు వెంకటేశ్‌కి, అటు మంత్రి పొంగులేటికి ఇద్దరికీ రఘురాంరెడ్డి వియ్యంకుడు. దీనితో రఘురాం రెడ్డి ఎన్నికల ప్రచారంలో వీరి ప్రమేయం ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు.

Also Read : Sunetra Pawar: రూ. 25 వేల కోట్ల స్కామ్‌ కేసులో సునేత్ర పవార్‌కు క్లీన్‌ చిట్‌ !

Leave A Reply

Your Email Id will not be published!