హైదరాబాద్ : దక్షిణాది కోకిలమ్మగా సుప్రసిద్దురాలైన ఎస్. జానకి మన మధ్య నుంచి విడి పోయారు. ఇవాళ ఆమె అంత్యక్రియలు కుటుంబీకుల మధ్య జరిగాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, తదితర భాషలలో 45 వేలకు పైగా పాటలు పాడారు ఎస్. జానకి. తనకంటే ముందుగా ఎస్పీ బాల సుబ్రమణ్యం కన్ను మూశారు. ఈ ఏడాదిలో చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి అతిరథ మహారథులు ఈ లోకాన్ని వీడారు. వారిలో దిగ్గజ దర్శకుడు భారతీ రాజా, మరో దర్శకుడు, నటుడు భాగ్యరాజాతో పాటు ఇప్పుడు ఎస్. జానకి మనల్ని వీడారు. అయితే దివంగతులైన ఎస్. జానకి, ఎస్పీబీల కాంబో పేరు పొందింది. సంగీత దర్శకుడు ఇళయరాజా చేసిన చాలా పాటలలో ఈ ఇద్దరూ చాలా అద్భుతంగా, విజయవంతమైన పాటలను పాడారు.
దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ఎన్నో చిరస్మరణీయమైన పాటలను అందించింది. భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రసిద్ధ నేపథ్య గాయనీ గాయకుల జోడీలలో వీరు ఒకరు. ఈ జోడీ వందలాది పాటలను కలిసి పాడారు, వాటిలో చాలా వరకు ఎప్పటికీ నిలిచిపోయే అద్భుత విజయాలుగా నిలిచాయి. ఎన్నో కాలాతీతమైన యుగళ గీతాలను అందించారు. ఆమె పాడిన కొన్ని ముఖ్యమైన చిరస్మరణీయమైన జోడీలు ఇక్కడ ఉన్నాయి. ఘంటసాల, ఎస్. జానకి తెలుగు చలనచిత్ర రంగ స్వర్ణయుగంలో ఈ జోడీ ఎన్నో అద్భుతమైన క్లాసిక్ పాటలను అందించింది.
పి. బి. శ్రీనివాస్ ,ఎస్. జానకి – వీరు తమ మధురమైన , శృంగారభరితమైన యుగళ గీతాలకు ప్రసిద్ధి చెందారు. ఎస్పీబీ జానకమ్మ జోడీ వందలాది పాటలను కలిసి పాడారు, వాటిలో చాలా వరకు ఎప్పటికీ నిలిచి పోయే అద్భుత విజయాలుగా నిలిచాయి. కె. జె. ఏసుదాస్ ,ఎస్. జానకి కలిసి ఎన్నో హృదయానికి హత్తుకునే మధురమైన , భక్తి గీతాలను ఆలపించారు. వీరు పాడిన పాటలలో ఇప్పటికీ అలరారుతూనే ఉన్నాయి. సిరిమల్లె పువ్వ, మౌనమేల నోయి, ప్రియతమా నా హృదయమా , ఆమని పాడవే హాయిగా, మాటే రాణి చిన్నదాని, కీరవాణి, సువ్వి సువ్వి సువ్వాలమ్మా, అబ్బ నీ తీయని దెబ్బ , అరె ఏమైంది .. అనే పాటలు ఉన్నాయి.
