Ram Charan Naatu Naatu : నాటు నాటు భార‌త‌దేశ‌పు పాట‌

స్ప‌ష్టం చేసిన రామ్ చ‌ర‌ణ్

Ram Charan Naatu Naatu : న‌టుడు రామ్ చ‌ర‌ణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జాతీయ మీడియా నిర్వ‌హించిన చ‌ర్చ‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆస్కార్ అవార్డు గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. నాటు నాటు పాటకు ఆస్కార్ పుర‌స్కారం ద‌క్కింద‌న్నారు. ఈ పాట అద్భుతంగా రావ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డమ‌న్నారు. ఇదంతా ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి చ‌ల‌వ వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌న్నారు రామ్ చ‌ర‌ణ్‌(Ram Charan).

అయితే ఆస్కార్ అవార్డుల ప్ర‌దానోత్స‌వంలో భాగంగా ముందుగా నాటు నాటు సాంగ్ ప్ర‌ద‌ర్శ‌న‌లో సినిమాలో న‌టించిన , భాగం పంచుకున్న జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ పాల్గొనలేదు. దీనిపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు రామ్ చ‌ర‌ణ్(Ram Charan Naatu Naatu). ఆస్కార్ క‌మిటీ మిమ్మ‌ల్ని సంప్ర‌దించ లేదా అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే మేమంతా వేచి ఉన్నాం. కానీ వారు మ‌మ్మ‌ల్ని ఎందుకు సంప్ర‌దించ లేదో త‌న‌కు తెలియ‌ద‌న్నారు రామ్ చ‌ర‌ణ్‌.

కానీ త‌మ నాటు నాటు పాట‌కు ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగినందుకు సంతోషంగా ఉంద‌న్నారు. ప్ర‌జ‌లు త‌మ పాట‌ను విప‌రీతంగా ఎంజాయ్ చేశార‌ని ఇందుకు ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్లు చెప్పారు. ఇది భార‌త దేశానికి సంబంధించిన పాట‌..ముఖ్యంగా ప్ర‌జ‌ల‌కు సంబంధించిన పాట అని పేర్కొన్నారు. ఆస్కార్ ద‌శ‌కు చేరుకోవ‌డ‌మే గొప్ప విష‌య‌మ‌ని, అలాంటిది ఆస్కార్ అందుకోవ‌డం మామూలు విష‌యం కాద‌న్నారు రామ్ చ‌ర‌ణ్.

ఇదిలా ఉండ‌గా బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కు సంబంధించి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌గానే ఒక్క‌సారి మెద‌డు మొద్దు బారి పోయింద‌న్నారు. త‌న భార్య ఉపాస‌న మైక్ టైసన్ లాగా ప‌ట్టుకుంద‌న్నారు.

Also Read : రామ్ చ‌ర‌ణ్ కు అమిత్ షా స‌న్మానం

Leave A Reply

Your Email Id will not be published!