Saba Karim : వైస్ కెప్టెన్సీ రేసులో పంత్..జ‌డేజా

మాజీ సెలెక్ట‌ర్ స‌బా క‌రీం అంచ‌నా

Saba Karim Vice Captaincy : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ సెలెక్ట‌ర్ స‌బా క‌రీం షాకింగ్ కామెంట్స్ చేశాడు. కేఎల్ రాహుల్ పూర్ ప‌ర్ ఫార్మెన్స్ కార‌ణంగా వైస్ కెప్టెన్సీ కోల్పోయాడు. ఈ త‌రుణంలో జ‌ట్టులో ఉంటాడో లేడో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఇదే స‌మ‌యంలో బీసీసీఐ చీఫ్ సెలెక్ట‌ర్ చేత‌న్ శ‌ర్మ స్టింగ్ ఆప‌రేష‌న్ లో దొరికి పోవ‌డం, అందులో సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ త‌రుణంలో కొంద‌ర‌ని కావాల‌ని ప‌క్క‌న పెట్ట‌డంపై భ‌గ్గుమంటున్నారు.

ఇదిలా ఉండ‌గా రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ‌డంతో పంత్ ప్ర‌స్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. ఇదే స‌మ‌యంలో కేఎల్ రాహుల్ స్థానంలో ఎవ‌రు వైస్ కెప్టెన్ అవుతార‌నే దానిపై విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ త‌రుణంలో స‌బా క‌రీం(Saba Karim Vice Captaincy) కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ర‌వీంద్ర జ‌డేజా లేదా రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ అవుతార‌ని జోష్యం చెప్పారు. ఎందుకంటే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కేఎల్ రాహుల్ ను తీసుకుని జ‌ట్టు టీమ్ ఇబ్బందుల్లో ప‌డ‌లేద‌ని పేర్కొన్నాడు.

మొద‌టి, రెండు టెస్టుల‌కు సంబంధించి కేఎల్ రాహుల్ ఉప నాయ‌కుడిగా ఉన్నాడు. కానీ మూడోది, నాలుగో టెస్టుకు అత‌డిని ప‌క్క‌న పెట్టింది బీసీసీఐ. దీంతో తిరిగి జ‌ట్టులో ఉంటాడ‌ని మాత్రం భ‌రోసా ఇచ్చారు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్. ఈ మొత్తం ఎపిసోడ్ పై స్పందించిన స‌బా క‌రీం వైస్ కెప్టెన్ గా జ‌డేజా లేదా పంత్ ను ఎంపిక చేస్తార‌ని జోష్యం చెప్పాడు.

Also Read : విశ్వ విజేత నువ్వా నేనా

Leave A Reply

Your Email Id will not be published!