MRS India 2022 : స‌ర్గ‌మ్ కౌశ‌ల్ మిసెస్ ఇండియా వ‌ర‌ల్డ్

2022-23కు గాను విజేత‌గా నిలిచింది

MRS India 2022 : స‌ర్గ‌మ్ కౌశ‌ల్ అరుదైన ఘ‌న‌త సాధించారు. భార‌త‌దేశంలో స‌రికొత్త మిసెస్ ఇండియా వ‌ర‌ల్డ్ 2022గా పోటీల్లో విజేత‌గా నిలిచారు. సోహా అలీ ఖాన్ , అదితి గోవిత్రిక‌ర్ , త‌దిత‌ర ప్ర‌ముఖ‌ల స‌మ‌క్షంలో ముంబైలో జ‌రిగిన పోటీలో శ్రీ‌మంతి స‌ర్గ‌మ్ కౌశ‌ల్(MRS India 2022) టైటిల్ సాధించారు.

స‌ర్గ‌మ్ కౌశ‌ల్ సాధించిన గెలుపు క్ష‌ణాల‌కు సంబంధించిన వీడియోను మిసెస్ ఇండియా ఇంక్ అనే సంస్థ ఆన్ ఆన్ లైన్ లో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్ గా మారింది.

స‌ర్గ‌మ్ కౌశ‌ల్ ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యూయేష‌న్ చేశారు. ఈ సంద‌ర్భంగా త‌న సంతోషాన్ని పంచుకున్నారు ఆమె. అంద‌రికీ వంద‌నాలు. నేను ఇవాళ విజేత‌గా నిలిచినందుకు ఆనందంగా ఉంద‌న్నారు.

2022-23 కు సంబంధించి పెద్ద ఎత్తున మిసెస్ ఇండియా వ‌ర‌ల్డ్ పోటీ(MRS India 2022) నిర్వ‌హించారు. నేను ఇక్క‌డికి వ‌చ్చాను. ఉప్పొంగి పోయాను. నా భావాల‌ను మాటల్లో చెప్ప‌లేను.

చాలా ఏళ్లుగా నేను దీని కోసం వేచి ఉన్నాను. ఇవాళ ద‌క్కింది. ఈ క్ష‌ణాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. నేను కోరుకున్న కిరీటం నాకు ద‌గ్గ‌ర‌గా వ‌స్తుంద‌ని అనుకోలేదు.

కానీ ఇది క‌ల కాదు నిజ‌మేన‌ని నిరూపిత‌మైంది. కేవ‌లం ఒక అమ్మాయి ఈ ప్ర‌పంచాన్ని ఎలా విజేత‌గా నిలిచింద‌నేది ఈ గెలుపుతో రూఢీ అయ్యింద‌ని పేర్కొంది.

ఇందుకు సంబంధించి క్యాప్ష‌న్ జ‌త చేసింది స‌ర్గ‌మ్ కౌశ‌ల్(MRS India 2022). ఆమె గ‌తంలో విశాఖ‌ప‌ట్ట‌ణంలో టీచ‌ర్ గా ప‌ని చేసింది. త‌న భ‌ర్త ఇండియ‌న్

నేవీలో ప‌ని చేస్తున్న‌ట్లు తెలిపింది.

Also Read : ఉత్త‌మ రెస్టారెంట్ గా ‘చాయ్ పానీ’

Leave A Reply

Your Email Id will not be published!