AP Konaseema News : వాళ్ళ ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చిన కలెక్టర్ కు గ్రామస్తుల ప్రశంసలు

వరదల సమయంలో రోడ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది

AP Konaseema News : అంబేద్కర్-కోనసీమ ప్రాంతంలో వరదల సమయంలో వంతెనలు లేకపోవడంతో వివిధ గ్రామాల వాసులు గత కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల సమయంలో రోడ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. వారి సమస్యలను పరిష్కరించిన అంబేద్కర్ కోనసీమ(Konaseema) జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా లంక గ్రామాల్లో రోడ్డు పనులకు పెద్దపీట వేశారు. స్థానిక మండల పరిధిలోని మామిడి కుదురు-అప్పనపల్లి మార్గం మధ్యలో కొర్లకుంట వద్ద శిథిలావస్థకు చేరుకున్న బ్రిడ్జిని ఆ ప్రాంతంలో సర్వే చేయగా గుర్తించారు. అంతేకాకుండా చుట్టుపక్కల నాలుగు గ్రామాల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడటంపై దృష్టి సారించారు. ఈ అభివృద్ధి పనుల్లో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

AP Konaseema News Viral

దాదాపు 54 లక్షలు వెచ్చించి వంతెన నిర్మాణం చేపట్టారు. గ్రామస్తులు ఈ కొత్త వంతెనకు హిమాన్షు శుక్ల వారిది అని నామకరణం చేసారు. బ్రిడ్జి నిర్మాణం వల్ల పెదపట్నం, పెదపట్నంలంక, అప్పనపల్లి, దొడ్డవరం నాలుగు గ్రామాలకు ముంపునకు గురికావడం పూర్తిగా అరికట్టబడింది. ఇందుకు గ్రామస్తులు కలెక్టర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా నూతనంగా నిర్మించిన వంతెనను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. మండల పరిషత్ నిధుల నుంచి సుమారు 5.20 లక్షలు కేటాయించి ఈ వంతెనకు ఇరువైపులా సీసీ రోడ్లు నిర్మించారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో నాలుగు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ శుక్లా స్వయంగా గుర్తించి అభివృద్ధికి శ్రీకారం చుట్టారు.

Also Read : Satnam Singh Sandhu : రాజ్యసభ ఎంపీగా సత్నామ్ సింగ్ సందు..ఎంపిక చేసిన ప్రెసిడెంట్

Leave A Reply

Your Email Id will not be published!