TDP-Janasena : నేడు గుంటూరులో టీడీపీ-జనసేన అధినేతల సమక్షంలో జయహో బీసీ సభ

బీసీ డిక్లరేషన్‌లో చేర్చాల్సిన అంశాలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జనసేన, పార్టీ నేతలతో చర్చించారు

TDP-Janasena : జయహో బీసీ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం బీసీలకు చేస్తున్న అన్యాయాలను నాయకులు ప్రజలకు వివరించనున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బిసిలు ఆ పార్టీకి అండగా ఉన్నారు. వారి రక్షణకు ప్రత్యేక చట్టాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

TDP-Janasena Meeting

బీసీ డిక్లరేషన్‌లో చేర్చాల్సిన అంశాలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జనసేన, పార్టీ నేతలతో చర్చించారు. ఈ సదస్సులో సమగ్ర బీసీ డిక్లరేషన్‌ను చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు సంయుక్తంగా ప్రకటించనున్నారు. జయహో బీసీ సదస్సును నిర్వీర్యం చేసేందుకు వైసీపీ యోచిస్తోందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సదస్సు కోసం ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవడానికి ప్రభుత్వం నిరాకరించినట్లు తెలుస్తోంది. బీసీ జయహో సదస్సు ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది.

Also Read : DSC 2024: డీఎస్సీ నిర్వహణపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం !

Leave A Reply

Your Email Id will not be published!