Pendyala Krishna Babu : అనారోగ్యంతో మృతి చెందిన కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే

దీని తరువాత టివి రామారావు టిడిపి నుండి ఎమ్మెల్యే అయ్యారు....

Pendyala Krishna Babu : తూర్పుగోదావరి కొవ్వూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కృష్ణబాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ తెల్లవారుజామున ఆయన మృతి చెందినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు ధృవీకరించారు. కృష్ణబాబు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామం దోమెల్‌కు తరలించారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Pendyala Krishna Babu No More

కాగా, టీడీపీకి కంచుకోటగా ఉన్న కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఆంధ్రా షుగర్స్ అధినేత ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ మేనల్లుడు పెండ్యాల కృష్ణబాబు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గంగా మారడంతో కృష్ణబాబు సీన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీని తరువాత టివి రామారావు టిడిపి నుండి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో టీడీపీ టికెట్‌పై గెలిచిన జవహర్‌ మంత్రి కూడా అయ్యారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నా పెండ్యాల కుటుంబానికి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఆధిక్య‌త ఉంది. ముఖ్యంగా కృష్ణబాబు తమ్ముడు అచ్చిబాబు చెప్పినట్లు వినాల్సిన పరిస్థితులు వస్తాయి.

Also Read : Delhi Liquor Case : ఈడీ కవితపై దాఖలు చేసిన ఛార్జ్ షీటుపై విచారణ ముగిసినట్టేనా..

Leave A Reply

Your Email Id will not be published!