Minister Uttam Kumar : వాతావరణానికి అనుగుణంగా పంటల మార్పు

పంటలు కూడా మారుతున్నాయని, భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.....

Minister Uttam Kumar : వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో సోమాజిగూడ హోటల్‌ టూరిజం ప్లాజాలో ‘ఎనర్జీ ట్రాన్స్‌మిషన్‌ ఇన్‌ ఇండియా విత్‌ ఫోకస్‌ ఆన్‌ తెలంగాణ’ అనే అంశంపై వర్క్‌షాప్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వర్క్‌షాప్‌ వల్ల సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌ సానుకూల ఫలితాలు సాధిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Minister Uttam Kumar Comment

మేధావులు మరియు పర్యావరణ కార్యకర్తలు సంయుక్తంగా వాతావరణ మార్పు మరియు స్వచ్ఛమైన డాక్యుమెంట్ ని అందించగలిగితే, ప్రభుత్వం నుండి ఖచ్చితమైన చర్య పొందడానికి కృషి చేస్తామని చెప్పారు. వాతావరణంలో ఎన్నో మార్పులు వచ్చాయి… ఒక్కోసారి అన్ని అంచనాలకు మించిన మార్పులు. పంటలు కూడా మారుతున్నాయని, భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. క్లీన్ ఎనర్జీకి శాయశక్తులా కృషి చేస్తాం…జలాశయాలను కాపాడుకుంటాం…ప్రత్యేక కమిటీ వేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read : Pinnelli Rama Krishna Reddy: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు షరతులు !

Leave A Reply

Your Email Id will not be published!