CM Chandrababu : గిన్నిస్ రికార్డు స్థాయిలో విశాఖ యోగా కార్యక్రమం

ఇదే స్వచ్చాంధ్ర- స్వర్ణాంధ్ర అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు...

CM Chandrababu : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ఈ యోగా కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాలని ఆకాంక్షించారు. విశాఖపట్నంలోని ఆర్కేబీచ్‌లో 5 లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. 25 లక్షల మందికి యోగా సర్టిఫికెట్లు జారీ అవుతాయని ప్రకటించారు. యోగా అనేది ప్రజలందరి జీవితంలో భాగమైందని.. ప్రజలు ఆరోగ్యవంతులు కావాలని కోరుకున్నారు. ఏపీలో గ్రీన్ కవర్ పెంచటం, గ్రీన్ ఎనర్జీ సాధించటం, సర్క్యులర్ ఎకానమీ, ప్రజల ఆరోగ్యం కోసమే యోగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇదే స్వచ్చాంధ్ర- స్వర్ణాంధ్ర అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

CM Chandrababu Comments

ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ఉద్ఘాటించారు. ప్లాస్టిక్ మానవాళికి పెనుసవాల్‌గా మారిపోయిందని తెలిపారు. ఆవులు, గేదెలు ప్లాస్టిక్ వ్యర్ధాలను తింటున్నాయని.. ఆ పాలనే మనం తాగుతున్నామని వివరించారు. ఏనుగులు కూడా ప్లాస్టిక్ తిని అనారోగ్యం పాలవుతున్నాయని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

ప్రతీ నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు ఎక్కడా కనిపించకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. భూతాపంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయని.. గ్లోబల్ వార్మింగ్ ప్రపంచానికి సవాల్‌గా మారిందని చెప్పుకొచ్చారు. వర్షాలు తగ్గాయి, భూగర్భజలాలు ఇంకిపోతున్నాయి, సాగునీరు తగ్గిపోతోందని అన్నారు. భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ పెరిగి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఏపీలోని 68 నియోజకవర్గాల్లో ఉన్న నగరవనాలను 175 నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

Also Read : Maoist Leader Sudhakar : బీజాపూర్ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత సుధాకర్ మృతి

Leave A Reply

Your Email Id will not be published!