Pawan Kalyan : అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు...
Pawan Kalyan : రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలతో మహిళలను అవమానించారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. అమరావతి ప్రాంత మహిళలపై సాక్షి మీడియాలోని చర్చ కార్యక్రమంలో భాగంగా జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ ఖండించారు. రాజధానిపై కుట్రలు చేసేవారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Pawan Kalyan Slams
జర్నలిస్ట్ ముసుగులో అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రజలు, అధికారులు విశ్లేషించాలని అభిప్రాయపడ్డారు. సాక్షి ఛానల్ కూడా ఆ వ్యాఖ్యలతో.. మాకు సంబంధం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. కుల ముద్రలు వేసి మహిళలను అవమానిస్తున్నారంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పేర్కొన్నారు. ఇక్కడ విలసిల్లిన బౌద్ధాన్నీ అవహేళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతానికి బలమైన చారిత్రక, ఆధ్యాత్మిక, బౌద్ధ ధర్మ నేపథ్యం ఉన్న విషయాన్ని విస్మరించవద్దని సూచించారు. రాజధాని కోసం భూములిచ్చిన వారిలో 32 శాతం ఎస్సీ, ఎస్టీ.. 14 శాతం బీసీ రైతులు ఉన్నారని వివరించారు.
వైసీపీ(YCP) అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు చెందిన సాక్షి మీడియాలో చర్చ కార్యక్రమం వేదికగా చేసిన కామెంట్లు ప్రస్తుతం దుమారం రేగాయి. అయితే ఈ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను.. ఈ ప్రొగ్రామ్లో కొమ్మినేని శ్రీనివాసరావు ఖండించకపోగా.. ఆయన వ్యంగ్యంగా కామెంట్ చేయడం పట్ల పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక ఆ మీడియా యాజమాన్యం సైతం దీనిని సమర్థించుకొనే విధంగా.. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని స్పష్టం చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సైతం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొంది. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై రాజధాని ప్రాంత రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టారు. 24 గంటల్లో స్పందించకుంటే.. సాక్షి కార్యాలయాలను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. అలాంటి వేళ.. సీఎం చంద్రబాబు నాయుడ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత వరుసగా స్పందించారు.
Also Read : Kamal Haasan : హిందీ భాషపై నటుడు కమల్ హాసన్ ఘాటు వ్యాఖ్యలు