Ayodhya : బాల రాముడి భక్తులకు మరో సంచలన అప్డేట్

ప్రధాన విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ఈ సేవలను అందిస్తుంది

Ayodhya : అయోధ్య రామయ్యను దర్శించుకోవాలనుకునే వారికి శుభవార్త. హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమానాలు నడపనున్నారు. ఏప్రిల్ 2 నుంచి వారానికి మూడు రోజులు విమాన సేవలు అందుబాటులో ఉంటాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్స్ ద్వారా ప్రకటించారు. మంగళవారం, గురు, శనివారాలు. హైదరాబాద్ నుంచి రామజన్మభూమి అయోధ్యకు ఇప్పటికే పలు రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు నేరుగా విమానాలను బుక్ చేసుకునే అవకాశం ఉంది.

Ayodhya New Updates

ప్రధాన విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ఈ సేవలను అందిస్తుంది. హైదరాబాద్ నుండి 2 గంటల్లో అయోధ్య చేరుకోవచ్చు. మంగళ, గురు, శనివారాల్లో విమానాలు శంషాబాద్ నుంచి ఉదయం 10:45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:45 గంటలకు అయోధ్య చేరుకుంటాయి. ఈ రోజుల్లో విమానం అయోధ్య నుంచి మధ్యాహ్నం 1:25 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 3:25 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

Also Read : AP news : ఆంధ్రప్రదేశ్ లో వీడని ఆర్టీసీ బస్సుల కష్టాలు

Leave A Reply

Your Email Id will not be published!