Butchaiah Chowdary : బాబాయ్ హత్య కేసులో సీఎం అంటూ బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సీపీ అవినీతి, అక్రమాలు కొనసాగుతున్నాయని విమర్శించారు

Butchaiah Chowdary : మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాబాయి హత్యకేసులో తన ప్రమేయం ఉండడంతో దర్యాప్తుకు ఆటంకం కలుగుతోందన్నారు. వివేకా హత్యకు జరిగిన కుట్రలో జగన్ పాత్ర కచ్చితంగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత చెల్లెలికి న్యాయం చేయలేకపోతే ప్రజలకు ఏం చేస్తారని నిరసన వ్యక్తం చేశారు.

Butchaiah Chowdary Slams

రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సీపీ అవినీతి, అక్రమాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని, అధికార యంత్రాంగంతో రాజకీయ ప్రచారాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని అనుమతులు లేకుండా ఆక్రమించి ప్రైవేట్‌ వ్యక్తులకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. రాజమండ్రి మెయిన్ గా రోజుకు 2 కోట్లు ఇసుక మాఫియా కొల్లగొడుతుందన్నారు. ఇసుక మొత్తం వాగు కింద నుంచి తవ్వుతున్నారు. బ్యారేజీకి ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Butchaiah Chowdary) మాట్లాడుతూ దయనీయమైన ప్రభుత్వం అభివృద్ధి చెందుతుందని అందరూ ఎదురు చూస్తున్నారన్నారు.

Aldo Read : Chandrababu : రేపు నెల్లూరులో పర్యటించనున్న బాబు..టీడీపీలో చేరనున్న పలు వైసీపీ నాయకులు

Leave A Reply

Your Email Id will not be published!