Aashritha Daggubati: ఎన్నికల ప్రచారంలో విక్టరీ వెంకటేశ్‌ కుమార్తె !

ఎన్నికల ప్రచారంలో విక్టరీ వెంకటేశ్‌ కుమార్తె !

Aashritha Daggubati: తెలంగాణా ఎన్నికల ప్రచారంలో అభ్యర్ధులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటున్నారు. అయితే సినిమాలకు, రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉండే విక్టరీ వెంకటేశ్ కు ఈ సారి ఎన్నికలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. తన కుమార్తె అశ్రితను తెలంగాణాకు చెందిన రామసహాయం రఘురాంరెడ్డి కుమారుడు వినాయక్ రెడ్డికి ఇచ్చి ఇటీవలే పెళ్లి చేసారు. అయితే ఖమ్మం లోక్ సభ స్థానం నుండి రామసహాయం రఘురాంరెడ్డి పోటీ చేస్తుండటంతో… వెంకటేశ్ కుమార్తె తన మామయ్య గెలుపుకోసం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఖమ్మం నగరంలోని ప్రసాద్ హైట్స్ రెసిడెంట్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న అశ్రిత… తమ మామయ్య రఘురాంరెడ్డికి ఓటు వేసి గెలిపించాలంటూ స్థానికులను ఆమె కోరింది.

Aashritha Daggubati in Election Campaign

ఈ సందర్భంగా వెంకటేశ్(Venkatesh) కుమార్తె అశ్రిత మాట్లాడుతూ… “రామసహాయం రఘురాంరెడ్డికి చాలా పట్టుదలని, మాటిచ్చారంటే కచ్చితంగా నెరవేరుస్తారని ఆశ్రిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన మామ కుటుంబసభ్యులతో ఎంత ప్రేమగా ఉంటారో… ప్రజల పట్లా అంతే వాత్సల్యంతో ఉంటారని చెప్పారు. ఏదైనా పని మొదలుపెడితే నూరు శాతం పూర్తయ్యే వరకు విశ్రమించరన్నారు. అందరూ ఆయనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామసహాయం రఘురాంరెడ్డి… సినీ హీరో వెంకటేశ్‌, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి వియ్యంకుడు. ఆయన తండ్రి సురేందర్‌రెడ్డి ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత. గతంలో పలుసార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా సేవలందించారు. ప్రస్తుతం వయసురీత్యా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీనితో ఆయన స్థానంలో రఘురాంరెడ్డి రంగంలోకి దించింది కాంగ్రెస్ అధిష్టానం. ఆయనకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన కుటుంబాలతో బంధుత్వం ఉంది. హీరో వెంకటేశ్‌ కుమార్తె అశ్రితను ఆయన పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి వివాహం చేసుకోగా… మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె స్వప్నిరెడ్డిని ఆయన చిన్నకుమారుడు అర్జున్ రెడ్డి వివాహమాడారు. అలా ఇటు వెంకటేశ్‌కి, అటు మంత్రి పొంగులేటికి ఇద్దరికీ రఘురాంరెడ్డి వియ్యంకుడు.

Also Read : Arvind Kejriwal: ఆప్ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ పై ఎన్ఐఏ కేసు ?

Leave A Reply

Your Email Id will not be published!