Pawan Kalyan : ఏపీ సీఎం వైఎస్ జగన్ పై జనసేన అధినేత సంచలన వ్యాఖ్యలు

తన ఇంట్లో నీళ్లు లేవని ఎంత వేడుకున్నా వినకుండా ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేయడం చూస్తుంటే

Pawan Kalyan : పంచభూతాలకు పార్టీ రంగులు పూసే దుర్మార్గం రాజ్యమేలుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీ రాష్ట్రంలో తాగునీటి కొనుగోళ్లకు సంబంధించి కూడా పార్టీలు లెక్కలు వేసుకోవడం విచారకరం. పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం మలబారంలో ఎస్టీ వర్గానికి చెందిన బానావత్ సమ్నిభాయ్‌ను ట్రాక్టర్‌తో తొక్కి చంపారని పవన్ తెలిపారు. ట్యాంకర్ల వద్దకు వెళ్తే ప్రతిపక్షాలు తాగునీరు తీసుకోకుండా అడ్డుకోవడం దారుణమన్నారు.

Pawan Kalyan Comments Viral

తన ఇంట్లో నీళ్లు లేవని ఎంత వేడుకున్నా వినకుండా ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేయడం చూస్తుంటే.. రాష్ట్రంలో దుష్ట పాలన సాగుతోందని అందరూ అర్థం చేసుకోవాలని పవన్(Pawan Kalyan) అన్నారు. తాగే నీలకు ..పేల్చే గాలికి జిఓ పాస్ చేయడమే వైసీపీకి మిగిలి ఉంది అన్నారు. పంచ భూతాలకు పార్ట్ రంగులు పులిమే దుర్మార్గపు పార్టీ రాజ్యమేలుతుందన్నారు. పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా ఘటనపై న్యాయంగా విచారణ జరిపించాలని కోరారు. మూడేళ్ల క్రితం పల్నాడు జిల్లా నకలికల్ ప్రాంతంలో వైసీపీ నేత ఒకరు ఎస్టీ మహిళను ట్రాక్టర్‌తో తొక్కి చంపారని పవన్ అన్నారు. ఈ పాలకుడు మాట్లాడితే ‘నా ఎస్టీలు.. నా ఎస్సిలు ..అంటూ ఎస్సిలను చంపేసే వ్యక్తి, ఎస్టీ మహిళను ట్రాక్టర్‌తో ఢీకొట్టాడా? అని పవన్ ప్రశ్నించారు.

Also Read : Butchaiah Chowdary : బాబాయ్ హత్య కేసులో సీఎం అంటూ బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!