Nara Bhuvaneshwari : నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ ముగింపు సభకు భారీ ఏర్పాట్లు

52వ రోజు తర్వాత ఆయనకు బెయిల్ మంజూరైంది....

Nara Bhuvaneshwari : చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమం ముగిసింది. కార్యక్రమం ఏప్రిల్ 13తో ముగుస్తుంది. విజయవాడలో ఇందుకు సంబంధించి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడును సీఐడి అరెస్ట్ చేసింది. దీంతో ఏసీబీ కోర్టు అతడికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

Nara Bhuvaneshwari Campaign

52వ రోజు తర్వాత ఆయనకు బెయిల్ మంజూరైంది. అయితే చంద్రబాబు అక్రమ అరెస్టు వల్ల 206 మంది చనిపోయారు. ఇందుకు సంబంధించి ఆయా కుటుంబాలకు నారా భువనేశ్వరి మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో ఆమె ‘నిజం గెలవాలి’ పేరుతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసారు. ఇందులో భాగంగా బాధిత కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి ఆర్థికసాయం అందించారు.

గత ఆరు నెలల్లో లోక్‌సభలోని 25 నియోజకవర్గాల్లో 95 నియోజకవర్గాల్లో 194 బాధిత కుటుంబాలను నారా భువనేశ్వరి సందర్శించారు. ఇందుకోసం ఆమె రాష్ట్రవ్యాప్తంగా 8,500 కి.మీ. ప్రయాణించారు. అయితే ఈ అంతిమ సభ ఏర్పాట్లను విజయవాడకు చెందిన టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని పర్యవేక్షిస్తున్నారు.

Also Read : Election Commission : దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ కీలక ఆదేశాలు

Leave A Reply

Your Email Id will not be published!