Brother Anil Kumar: సీఎం జగన్‌ పై బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు !

సీఎం జగన్‌ పై బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు !

Brother Anil Kumar: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై అతని బావ, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాపాలు చేసే వారిని తొక్కిపడేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం కడపలోని రాజారెడ్డి విధిలో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక వాఖ్యలు చేశారు. పాపులను తరమికొట్టాలంటే ప్రార్థన ఒక్కటే సరిపోదన్నారు. ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం. ఈ క్రమంలో ఎవరికి భయపడం.
ఆ దేవుడే అండగా ఉన్నాడు. దేవునిపై విశ్వాసం ఉంచి నిర్ణయం తీసుకోండంటూ ప్రజలకు బ్రదర్ అనిల్ సూచించారు. దీనితో బ్రదర్ అనిల్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Brother Anil Kumar Comments

సీఎం వైయస్ జగన్‌ పై ఇప్పటికే వైఎస్ షర్మిలతోపాటు వైయస్ వివేకా కుమార్తె వైఎస్ సునీత విమర్శలు సంధిస్తున్నారు. ఆ క్రమంలో అటు వైయస్ జగన్‌కి ఇటు వైఎస్ ఇంటి ఆడపడచుల మధ్య మాటల యుద్దం తార స్థాయికి చేరింది. ఇలాంటి సమయంలో బ్రదర్ అనిల్ కుమార్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేకెత్తిస్తున్నాయి. అదీ కూడా వైఎస్ ఫ్యామిలీకి అడ్డా అయిన కడప గడ్డపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పాపాలు చేసిన వారంటే ఎవరు.. వైఎస్ అవినాష్, వైఎస్ జగన్‌ లేననే చర్చ ఉమ్మడి కడప జిల్లాలో జోరందుకొంది.

ఇది ఇలా ఉంటే 2019లో వైఎస్ జగన్(YS Jagan) గెలుపు కోసం బ్రదర్ అనిల్ కుమార్… రాష్ట్రవ్యాప్తంగా పాస్టర్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలతో వరుస సమావేశాలు నిర్వహించారు. వైయస్ జగన్ గెలిస్తే.. మనందరికి చాలా ఉపయోగకరమంటూ వారికి వివరించారు. కానీ వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. వైయస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్‌లను పక్కన పెట్టేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ జగన్ తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదంటూ… గతంలో మీడియా ఎదుటే బ్రదర్ అనిల్ కుమార్‌ వాపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన భార్య వైఎస్ షర్మిలను కడప లోక్ సభ అభ్యర్థిగా గెలుపించుకొనేందుకు బ్రదర్ అనిల్ రంగంలోకి దిగారని.. అందులోభాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Also Read : KTR: హైదరాబాద్‌ కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా అడ్డుకుంటాం – మాజీ మంత్రి కేటీఆర్‌

Leave A Reply

Your Email Id will not be published!