Nara Lokesh : కారంపూడి సీఐ పై విరుచుకుపడ్డ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

కాగా ఏపీలో అధికారులు అధికార పార్టీ నేతలతో వత్తాసు పలుకుతున్నారు

Nara Lokesh : కారంపూడి సీఐ చిన్న మాల్లయ్యపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నాలా లోకేష్‌(Nara Lokesh) ఫైర్ అయ్యారు. వైసీపీ ప్యాకేజీ మత్తులో సీఐకి తెలియక పోయినా.. సీఎం జగ్గూభాయ్‌ సీను ఎప్పుడో అయిపోయిందని అన్నారు. మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన లోకేష్.. కారంపూడిలోని టీ స్టాల్‌లో టీ తాగుతున్న టీడీపీ నేతలను సీఐ మల్లయ్య తుపాకీతో బెదిరించడంపై స్పందించారు. మీరు సర్వీస్ రివాల్వర్‌తో గురి పెట్టారా? సన్నగండ్రలో టీడీపీ నేత చాపిడి రాములుపై తుపాకీ గురిపెట్టి కళ్లల్లో ఆనందం నింపిన సీఐ చిన్న మల్లయ్యను వెంటనే సస్పెండ్ చేయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఖాకీ పోకిరీలపై ఎన్నికల సంఘం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

Nara Lokesh Slams..

కాగా ఏపీలో అధికారులు అధికార పార్టీ నేతలతో వత్తాసు పలుకుతున్నారు. ఎన్నికల సంఘం ఎన్ని నిబంధనలు పెట్టినా, ఎన్నిసార్లు చెప్పినా కొందరు అధికారుల తీరు మారడం లేదు. అధికార వైసీపీ నేతలు, ప్రతిపక్ష నేతలు ఏం చేస్తున్నారంటే చూస్తూ ఊరుకునే అధికారులు.. చేస్తున్నదంతా తప్పే అంటున్నారు. పల్నాడు ప్రాంతంలో కారంపూడిలో సీఐ మాల్లయ్య టార్గెట్ టీడీపీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. టీ తాగుతుండగా టీడీపీ నాయకులను సీఐ తుపాకీలతో బెదిరించారు. తుపాకీ ఎందుకు తీసారని ప్రశ్నించిన టీడీపీ క్యాడర్‌పై మాల్లయ్య ఎదురుదాడికి దిగారు.

Also Read : TS Weather : భాగ్యనగరంలో భానుడు భగ భగ…ఈ 5రోజులు భారీ ఉష్ణోగ్రతలు..

Leave A Reply

Your Email Id will not be published!