MLA Kapu Ramachandra Reddy : బీజేపీలో చేరిన రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి

రామచంద్రారెడ్డి ఆయన భార్య కూడా భారతీయ జనతా పార్టీలో చేరారు

MLA Kapu Ramachandra Reddy : రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రాంచంద్రారెడ్డి అధికార వైఎస్సార్‌సీపీకి వీడ్కోలు పలికి బీజేపీలో చేరారు. శనివారం ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి సమక్షంలో ఎమ్మెల్యే కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కాపు రామచంద్రారెడ్డిని పురందేశ్వరి భారతీయ జనతా పార్టీ శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామచంద్రారెడ్డి ఆయన భార్య కూడా భారతీయ జనతా పార్టీలో చేరారు.

MLA Kapu Ramachandra Reddy Resign

ఇదిలా ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ రాకపోవడంతో కాపు రామచంద్రారెడ్డి గత కొంత కాలంగా వైసీపీ హైకమాండ్‌పై అసంతృప్తితో ఉన్నారు. సీఎం, వైసీపీ అధినేత జగన్ రెడ్డి వైఖరి నచ్చక కొద్ది రోజుల క్రితం తన పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం కాపు రామచంద్రారెడ్డి కాషాయి శాలువా కప్పుకున్నారు.

Also Read : RS Praveen Kumar : బీఎస్పీ పార్టీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుడ్ బాయ్

Leave A Reply

Your Email Id will not be published!