Ashok Gehlot : టైల‌ర్ హ‌త్య కేసులో బీజేపీ నోరు విప్పాలి

డిమాండ్ చేసిన రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్

Ashok Gehlot : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ టైల‌ర్ హ‌త్య కేసు. భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన బ‌హిష్కృత నాయ‌కురాలు నూపుర్ శ‌ర్మ మ‌హమ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని నిర‌సిస్తూ దారుణ హ‌త్య‌కు పాల్ప‌డ్డారు.

అయితే ఈ హ‌త్య‌కు పాల్ప‌డిన వారిలో నిందితుడు ఒక‌రు రాష్ట్ర బీజేపీ నేత‌ల‌తో క‌లిసి ఉన్న ఫోటోల‌ను కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధానంగా సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. అవి నెట్టింట్లో వైర‌ల్ గా మారాయి.

తాజాగా ఇదే అంశంపై మ‌రోసారి నిల‌దీశారు రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. ద‌నిపై ఎందుకు ఇంత వ‌ర‌కు బీజేపీ స్పందించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

చిన్న‌దానికి వాట్సాప్ యూనివర్శిటీలో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకునే స‌ద‌రు పార్టీ ఈ విష‌యంలో మాత్రం నోరు మెద‌క పోవ‌డంలో ఉన్న ఆంత‌ర్యం ఏమిటి అంటూ నిప్పులు చెరిగారు అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) .

ప్ర‌తి సంఘ‌ట‌న‌ను కులం, మ‌తం పేరుతో రాజ‌కీయం చేసే బీజేపీకి ఈ ఘ‌ట‌న ఎందుకు క‌నిపించ‌డం లేద‌న్నారు.

దేశంలో విద్వేష పూరిత ప్ర‌సంగాలు చేస్తూ మ‌నుషుల మ‌ధ్య ఆందోళ‌న‌లు చెల‌రేగేలా చేయ‌డంలో బీజేపీ స‌క్సెస్ అయ్యింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఇక‌నైనా ఇలాంటి చెత్త రాజ‌కీయాలు మానుకోవాల‌ని సూచించారు. బీజేపీయేత‌ర రాష్ట్రాల‌ను టార్గెట్ చేయ‌డం, అప్ర‌తిష్టపాలు చేయ‌డం బీజేపీకి ప‌రిపాటిగా మారింద‌ని మండిప‌డ్డారు సీఎం అశోక్ గెహ్లాట్.

ముందు దారుణ హ‌త్య‌కు పాల్ప‌డిన నిందితుడు మీ పార్టికి చెందిన వాడా కాదా అని ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు.

Also Read : జుబైర్ కేసును విచారించ‌నున్న సుప్రీం

Leave A Reply

Your Email Id will not be published!