Manish Sisodia : రూ. 800 కోట్లతో సర్కార్ కూల్చేందుకు కుట్ర
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా
Manish Sisodia : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి సంచలన ఆరోపణలు చేశారు కేంద్రంపై , భారతీయ జనతా పార్టీపై. ఇతర ప్రభుత్వాలను పడగొట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లు చేర్పిస్తే మరో రూ. 25 కోట్లు ఇవ్వాలని ఆఫర్లు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కంట్లో నలుసుగా మారిన ఆప్ సర్కార్ ను ఎలాగైనా గద్దె దించాలని ఏకంగా రూ. 800 కోట్లతో ప్లాన్ చేశారంటూ ఆరోపించారు మనీష్ సిసోడియా(Manish Sisodia).
హిమాచల్ ప్రదేశ్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్బంగా ఇక్కడికి వచ్చారు.
దేశ రాజధానిలో కొలువు తీరిన ఆప్ సర్కార్ ను కూల్చడమే పనిగా పెట్టుకున్నారంటూ ధ్వజమెత్తారు మనీష్ సిసోడియా.
బీజేపీయేతర ప్రభుత్వాలను, వ్యక్తులను , నాయకులను ప్రలోభాలకు గురి చేసే బదులు ప్రజా సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టాలని సూచించారు డిప్యూటీ సీఎం.
వారు సీరియల్ కిల్లర్స్ , ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఆప్ కు చెందిన కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు ఎవరూ అమ్ముడు పోరన్నారు.
వారంతా దేశం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టిన షహీద్ భగత్ సింగ్ అనుచరులని పేర్కొన్నారు మనీష్ సిసోడియా. ఇదిలా ఉండగా మద్యం పాలసీ స్కాంలో సిసోడియాతో పాటు మరో 14 మందిని నిందితులుగా చేర్చింది సీబీఐ. 14 గంటల పాటు ఆయన నివాసంలో సోదాలు జరిపారు.
Also Read : రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటు