Tanikella Bharani : త‌నికెళ్ల భ‌ర‌ణికి లోక్ నాయ‌క్ అవార్డు

ప్ర‌క‌టించిన యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీ ప్రసాద్

Tanikella Bharani : ప్ర‌ముఖ తెలుగు సినీ న‌టుడు, ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు, గాయ‌కుడు త‌నికెళ్ల భ‌ర‌ణికి(Tanikella Bharani)  అరుదైన పుర‌స్కారం ల‌భించింది. ఈ మేర‌కు భ‌ర‌ణికి లోక్ నాయ‌క్ ఫౌండేష‌న్ వార్షిక సాహిత్య అవార్డుకు ఎంపిక చేసిన‌ట్లు లోక్ నాయ‌క్ ఫౌండేష‌న్ నిర్వాహ‌కుడు , ఏపీ అధికార భాషా సంఘం చైర్మ‌న్ యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీ ప్రసాద్ వెల్ల‌డంచారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా అవార్డు గ్ర‌హీత‌ల‌కు విశాఖ‌లో జ‌రిగే బ‌హుమ‌తి ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మంలో అంద‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు.

ఇందులో భాగంగా త‌నికెళ్ల భ‌ర‌ణికి అవార్డుతో పాటు రూ. 2 ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తిగా అంద‌జేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. తెలుగు సంస్కృతి భాష‌, సాహిత్య రంగాల‌కు విశేషంగా కృషి చేసిన‌ వ్య‌క్తుల‌కు గ‌త 18 సంవ‌త్స‌రాల‌కు పుర‌స్కారాల‌ను అంద‌జేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీ ప్ర‌సాద్.

త‌నికెళ్ల భ‌ర‌ణితో(Tanikella Bharani)  పాటు దివంగ‌త సీఎం ఎన్టీఆర్ కు స్పెష‌ల్ ఆఫీస‌ర్ గా ప‌ని చేసిన జి. రామ‌చంద్ర‌రావు, వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు మోహ‌న్, భ‌ద్ర‌తాధికారి కృష్ణార‌వు, కారు డ్రైవ‌ర్ ల‌క్ష్మ‌ణ్ ను కూడా స‌న్మానించి రూ. ల‌క్ష చొప్పున న‌గ‌దు బ‌హుమ‌తి అంద‌జేశామ‌న్నారు.

ఇందులో భాగంగా ఇవాళ జ‌రిగే కార్య‌క్ర‌మానికి మిజోరం గ‌వ‌ర్న‌ర్ డాక్ట‌ర్ కంభంపాటి హ‌రిబాబు, అతిథులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ చ‌లమేశ్వ‌ర్ , సినీ న‌టుడు మోహ‌న్ బాబు, లోక్ స‌త్తా ఫౌండ‌ర్ ఎన్. జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ‌, విజ్ఞాన్ విద్యా సంస్థ‌ల కార్య‌ద‌ర్శి కూడా హాజ‌ర‌వుతారు.

ఇదిలా ఉండ‌గా న‌టుడిగా త‌న‌దైన ప్ర‌త్యేక‌మైన గుర్తింపు పొందారు త‌నికెళ్ల భ‌ర‌ణి.

Also Read : టొరంటో ఫెస్టివ‌ల్ లో భార‌తీయ సినిమాలు

Leave A Reply

Your Email Id will not be published!