Rahul Gandhi : పాస్టర్ ను కలిసిన రాహుల్ పై బీజేపీ ఫైర్
ద్వేష పూరిత ప్రసంగంలో కీలక పాస్టర్
Rahul Gandhi : భారత్ జోడో యాత్ర చేపట్టిన కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ చిక్కుల్లో ఇరుక్కున్నారు. తమిళనాడులో ద్వేష పూరిత ప్రసంగం చేసిన పాస్టర్ ను కలుసుకున్నారు.
ఇది ప్రస్తుతం రాద్దాంతానికి తెర తీసింది. భారత దేశం పట్ల, అత్యధిక జనాభా కలిగిన హిందువుల పట్ల తీవ్ర పరుష పదజాలాన్ని వాడిన, ద్వేష పూరిత ప్రసంగం చేసిన పాస్టర్ ను ఎలా కలుసుకుంటారంటూ ప్రశ్నించింది భారతీయ జనతా పార్టీ.
భారత్ జోడో వర్సెస్ టోడోను ప్రేరిపించాచడంటూ మండిపడింది. రాహుల్ గాంధీ విరామం కోసం విడిది చేసిన పులియూర్ కురిచి ముట్టడిచన్ పరాయి చర్చిలో పాస్టర్ జార్చ్ పొన్నయను కలిశారు.
తమిళనాడు పాస్టర్ తో రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇంటరాక్ట్ అవుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీంతో బీజేపీకి ఇదో కొత్త ఆయుధంగా మారింది. కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని ఏకి పారేసేందుకు స్టార్ట్ చేసింది.
కాథలిక్ పాస్టర్ రాహుల్ గాంధీతో చర్చ సందర్భంగా ఏసు నిజమైన దేవుడు..శక్తి వంటిది కాదన్నారు. ఇదిలా ఉండగా పొన్నయ్య హిందూ ద్వేషం కారణంగా గతంలో అరెస్ట్ అయ్యాడు.
భారత మాత మలినాలు మనల్ని కలుషితం చేయ కూడదు. కాబట్టి నేను బూట్లు ధరిస్తానంటూ ప్రకటించాడు పొన్నయ్య. బీజీపికి చెందిన సీనియర్ నాయకుడు పూనావాలా ( Shehzad Poonawalla) రాహుల్ గాంధీ, పాస్టర్ ల మధ్య జరిగిన క్లిప్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు.
యేసు క్రీస్తు భగవంతుడి రూపమా అది సరైనదేనా అని రాహుల్ ప్రశ్నించారు. దానికి పాస్టర్ నిజమైన దేవుడు అంటూ సమాధానం ఇచ్చారు.
Also Read : గేమింగ్ యాప్ కేసులో ఈడీ దాడులు